Redmi Note 13 Pro Plus 5G World Champion Edition: చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. తన బ్రాండ్ నుంచి నోట్ 13 ప్రో+ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ను దేశంలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది. కంపెనీ రెడ్మీ Note 13 Pro + వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ను తీసుకురానుంది. ఈ ఫోన్కు సంబంధించి మైక్రోసైట్ను విడుదల చేసింది. దీనిలో ఫోన్ డిజైన్ గురించి వెల్లడైంది.
ఫోన్ బ్యాక్ డార్క్ బ్లూ కలర్లో ఉంది. అలాగే మూడు కెమెరా రింగ్లు గోల్డ్ కలర్లో కనిపిస్తాయి. దీని వెనుక AFA లోగో చూడొచ్చు. ఇందులో అర్జెంటీనా NT కూడా ఉంది. ఈ రాబోయే ఫోన్ ఏప్రిల్ 30 న మొబైల్ ప్రియులకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఏ వేరియంట్లలో రాబోతుంది, ఫీచర్లు, కెమెరా తదితర విషయాలను తెలుసుకోండి.
Also Read: త్వరలో మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 8a ఫోన్.. ఫీచర్లు మహా అద్భుతం!
ఫోన్కు సంబంధించిన వివరాను ఒక టిప్స్టర్ వెల్లడించారు. దీని ప్రకారం ఫోన్ లుక్ అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు జెర్సీని పోలి ఉంటుంది. ఇందులో బ్యాక్ ప్యానెల్లో సగం బ్లూ, వైట్ స్ట్రిప్స్తో చూడవచ్చు. ఈ ఫోన్ నోట్ 13 స్టాండర్డ్ వేరియంట్ను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ Redmi ఫోన్లో 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, డైమెన్షన్ 7200 అల్ట్రా ప్రాసెసర్, 200 MP మెయిన్ బ్యాక్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Redmi Note 13 Pro+ 5G 6.67-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా, స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ ఇస్తుంది. ప్రొటక్షన్ కోసం కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ను అందించింది. దీనిలో కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. స్క్రీన్ 1800 నిట్లు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.
Also Read: మొబైల్ లవర్స్కు కిక్కిచ్చే న్యూస్.. రూ.7,999లకే స్మార్ట్ఫోన్
Redmi నోట్ 13 Pro ప్లస్ ధర విషయానికి వస్తే 8 GB RAM+256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999. ఇది కాకుండా 12 GB RAM + 256 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 33,999గా ఉంది. ఇందులో మరో వేరియంట్ 12 GB RAM+512 GB స్టోరేజ్ ధర రూ.35,999గా నిర్ణయించారు.