E-Paper
Advertisement

Hardik Ex Wife Natasha : నటాషాకు అంత బలుపా.. సెల్ఫీ అడిగితే అలా తోసేసింది ఏంటి

Hardik Ex Wife Natasha : నటాషాకు అంత బలుపా.. సెల్ఫీ అడిగితే అలా తోసేసింది ఏంటి
Advertisement

Hardik Ex Wife Natasha : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా  నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే పాండ్యాతో విడాకుల తరువాత కొద్ది రోజులకే తన స్వదేశానికి బయలుదేరింది నటాషా స్టాంకోవిచ్. ఇక తన స్వదేశం సెర్బీయాలోనే తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని.. ఆగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా నటాషా స్టాంకోవిచ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Also Read : Billy Bowden : అంపైర్ బిల్లీ బౌడెన్ వేళ్లు ఎప్పుడు ఎందుకు అలా వంకరగా ఉంటాయి.. అంత ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడా?

Advertisement

వీడియో తీయకుండా అడ్డుకున్న నటాషా 

ఇటీవలే నటాషా.. తన కుమారుడు అగస్త్య తో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఓ లేడీ అగస్త్యను, నటాషాను వీడియో తీస్తుండగా.. ఆ వీడియో తీయకుండా నటాషా తోసేసింది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక సోషల్ మీడియాలో నటాషా కి ఇంత బలుపా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  మరోవైపు విడాకులు తీసుకున్న తరువాత నటాషా స్టాంకోవిచ్ మరో వ్యక్తితో కలిసి తిరుగుతోంది. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. అది చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు కూడా వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ప్రయత్నాల చేస్తున్నట్టు సమాచారం. తాను ఓ ఈవెంట్ కి వెళ్తూ.. హార్దిక్ పాండ్యా కొడుకును కూడా తీసుకెళ్లాడు.

Advertisement

పాండ్యా కి విరామం.. 

ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తరుచూ గాయాల బారిన పడటంతో టెస్టులు ఆడనని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతానని ఇప్పటికే హార్దిక్ బీసీసీకి స్పష్టం చేశాడు. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025లో టీమిండియా తరపున తిరిగి ఆడనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇది యూఏఈలో నిర్వహిస్తారు. ఇక బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో.. ఆసియా కప్ తరువాత అక్టోబర్ లోనే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. దీంతో ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన వరకు హార్దిక్ పాండ్యా కి విరామం దొరికినట్టు అయింది. పాండ్యా టీమిండియాలో కీలక ఆటగాడిగా రాణించడం విశేషం.  

?igsh=OHloMDBmYzM0Zm1t

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×