E-Paper
Advertisement

Nipah Virus-T20I WC: నిఫా వైరస్ టెన్ష‌న్‌..ఇండియాలో లాక్ డౌన్ భ‌యాలు..టీ20 ప్ర‌పంచ క‌ప్ ర‌ద్దు ?

Nipah Virus-T20I WC: నిఫా వైరస్ టెన్ష‌న్‌..ఇండియాలో లాక్ డౌన్ భ‌యాలు..టీ20 ప్ర‌పంచ క‌ప్ ర‌ద్దు ?
Advertisement

Nipah Virus – T20I WC: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20i world cup 2026) ప్రారంభానికి కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఇండియా అలాగే శ్రీలంక దేశాలలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పై కొత్త టెన్షన్ మొదలైంది. ఈ టోర్నమెంట్ పై నిఫా వైరస్ ( Nipah virus) ఎఫెక్ట్ పడనున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నిఫా వైరస్ కారణంగా ఇండియాలో ( India ) టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగడం కష్టమే అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. శ్రీలంకకు తరలిపోయే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీలంకతో పాటు దుబాయ్ వేదికలు ఖరారయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుపై నిఫా ఎఫెక్ట్ !

Advertisement

కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇద్దరు నర్సులకు ఈ వైరస్ సోకిందట. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అటు కేరళలో మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా రెండు మరణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో లాక్ డౌన్ పెడతారని కొంతమంది విషప్రచారం చేస్తున్నారు. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరగడం కష్టమే అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ టోర్నమెంట్ శ్రీలంకతో పాటు దుబాయ్ లో నిర్వహించాలని కూడా కోరుతున్నారు. ఇండియాలో నిఫా వైరస్ ఎఫెక్ట్ ఉండడం వల్ల విదేశీ ప్లేయర్లు వస్తే వాళ్లకు కూడా ఈ వైరస్ సోకుతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కాకుండా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహించాలని కోరుతున్నారు. ఇదంతా చేసేది పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ సోషల్ మీడియా. అటు శ్రీలంక సోషల్ మీడియా కూడా ఇదే ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ట్వీట్లు వైరల్ గా మారాయి.

లాక్ డౌన్ పై WHO కీలక ప్రకటన

Advertisement

పశ్చిమ బెంగాల్లో తాజాగా నమోదు అయిన నిఫా వైరస్ పట్ల ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. కరోనా అంత డేంజర్ కాదని.. నిఫా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించింది. లాక్ డౌన్ లాంటి ఆంక్షలు పెట్టుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ప్రకటనతో ఇండియన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు ఐసీసీ కూడా స్పందించిందట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్లుగా ఎలాంటి లాక్ డౌన్ ఉండబోదని.. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరుగుతుందని వెల్లడించిందట ఐసీసీ.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

Related News

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

Big Stories

Advertisement
×