E-Paper
Advertisement

Medchal district: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Medchal district: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Medchal district: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున ఒక గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎంఎంటిఎస్ (MMTS) డౌన్ లైన్‌పై వెళ్తున్న రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. శనివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అనే కోణంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

అయితే చర్లపల్లి సెక్షన్‌లోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు గూడ్స్ రైలు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే ఆయన వాకీటాకీ ద్వారా రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మృతులు బోడుప్పల్‌లోని హరితహరణం కాలనీకి చెందిన వారిగా తేలింది. మృతులను పి. సురేందర్ రెడ్డి (40), ఆయన భార్య పి. విజయ (38), వారి కుమార్తె పి. చేతన రెడ్డిగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఎటువంటి ప్రయాణ టిక్కెట్లు గానీ, ఇతర విలువైన వస్తువులు గానీ లభించకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు ఈ ఘటనపై జీఆర్‌పీ సికింద్రాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 57/2026 కింద, బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది సంయుక్తంగా ‘జాయింట్ ఆబ్జర్వేషన్ రిపోర్ట్’ను సిద్ధం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబం ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: ముగ్గురు మంత్రులు VS కూనంనేని.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ప్రజలకు ఇలాంటి సమస్యలు మానసిక ధైర్యం ముఖ్యం ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు మానసిక నిపుణులను సంప్రదించాలని హెచ్చరించారు. అలాగే సురేందర్ రెడ్డి కుటుంబం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారి బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×