E-Paper
Advertisement

Shoaib Akhtar: ధురంధర్ 2 చూశాక‌ పాకిస్తాన్‌లో తిర‌గాలంటే ప్యాంట్లు త‌డిచిపోతున్నాయ్‌

Shoaib Akhtar:  ధురంధర్ 2  చూశాక‌ పాకిస్తాన్‌లో తిర‌గాలంటే ప్యాంట్లు త‌డిచిపోతున్నాయ్‌
Advertisement

Shoaib Akhtar: దేశ వ్యాప్తంగా ఏ మూలకు వెళ్లిన ధురంధర్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ధురంధర్ మొదటి పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఇంత హవా కనిపించకపోయినా, ధురంధర్ 2 సినిమా ( Dhurandhar 2 movie) రిలీజ్ అయిన తర్వాత దేశ రాజకీయాలను ఈ మూవీ కుదిపేస్తోంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈ సినిమా ఉందని బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ధురంధర్ 2 సినిమా చూసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు గజగజ వణికి పోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై షాహిద్ అఫ్రీది స్పందించగా లేటెస్ట్ గా షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) రియాక్ట్ అయ్యాడు. ధురంధర్ 2 సినిమా దెబ్బకు పాకిస్తాన్ లో తిరగాలంటే ప్యాంట్లు తడిచిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

ధురంధర్ 2 చూశాక‌ పాకిస్తాన్ తిర‌గాలంటే ప్యాంట్లు త‌డిచిపోతున్నాయ్‌

Advertisement

ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) కూడా స్పందించారు. ధురంధర్ 2 ( Dhurandhar 2 movie) సినిమా చూసిన తర్వాత పాకిస్తాన్ లో తిరగాలంటే భయం అవుతోంద‌ని వెల్లడించారు. పాకిస్తాన్ లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని కోరారు. బిచ్చగాడు నుంచి కోటీశ్వరుడి వరకు ఎవరో ఒకరు ఇండియాకు సంబంధించిన ఏజెంట్ కచ్చితంగా పాకిస్తాన్ లో ఉంటారని ఆరోపణలు చేశారు. త‌మ దేశంలోని ప్రతి వీధిలో ఇండియాకు సంబంధించిన ఏజెంట్ ఉండే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోని ఇండియాకు సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారనే దానిపైన పాకిస్తాన్ సర్కార్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ ఏజెంట్లను గుర్తించాలని కోరారు. వాళ్ల‌ను ఏరివేసి, ఇండియాకు బుద్ది చెప్పాల‌ని కోరారు.

పాకిస్తాన్ లో దురంధర్ 2 సినిమా ఎఫెక్ట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో దుమ్ములేపిన ధురంధర్ 2 సినిమా పాకిస్తాన్ లో ( Pakistan) ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత పాకిస్తాన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాకిస్తాన్ లో ఏ మూలన భారత దేశానికి సంబంధించిన ఏజెంట్ ఉన్నాడో ? అని అక్కడి ప్రజలు భయపడుతున్నట్లు వీడియోలు వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌ సర్కార్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ లో బిచ్చగాళ్లను కూడా అక్కడి ప్రభుత్వం వదలడం లేదు. అనుమానం వచ్చిన వాళ్ళను వెంటనే అరెస్టు చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, జైలుకు తరలిస్తోంది. అంద‌రినీ అనుమానిస్తూ, టార్చ‌ర్ చేస్తోంది స‌ర్కార్. ఇక ఈ వీడియోలు చూసి, ఇండియ‌న్స్ ర‌క ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా అంటేనే, పాకిస్తాన్ కు వ‌ణుకుపుడుతోంద‌ని అంటున్నారు.

Advertisement

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×