Abhishek Sharma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే టీమ్ ఇండియా డేంజర్ బౌలర్ హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ గాయాల బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే హర్షిత్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. వాషింగ్టన్ సుందర్ ఆడేది నమ్మకమే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా అరివీర భయంకర బ్యాటర్ అభిషేక్ శర్మ ( abhishek sharma) ఆస్పత్రి పాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో అభిషేక్ శర్మ ( abhishek sharma health update) బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నమీబియాతో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం అవుతాడని అంటున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అభిషేక్ శర్మకు తీవ్ర జ్వరంతో పాటు కడుపునొప్పి చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిషేక్ శర్మ ఆసుపత్రి పాలు అయినట్లు తెలుస్తోంది. మొన్న ముంబై వేదికగా మ్యాచ్ జరిగిన సందర్భంగా హోటల్ లో తిన్న ఆహారం వల్ల అస్వస్థతకు అభిషేక్ శర్మ గురైనట్లు తెలుస్తోంది.
దీంతో అభిషేక్ శర్మకు జ్వరంతోపాటు కడుపునొప్పి కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రికి కూడా అభిషేక్ శర్మ వెళ్లాడట. మొన్న రాత్రి జ్వరంతోనే గౌతమ్ గంభీర్ ఇంట్లో జరిగిన విందుకు అభిషేక్ శర్మ హాజరయ్యాడు. ఆ తర్వాత కడుపునొప్పి కూడా విపరీతంగా చోటు చేసుకుందట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అభిషేక్ శర్మ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ అనారోగ్యం నేపథ్యంలో నమిబియాతో ఈ నెల 12వ తేదీన జరగబోయే మ్యాచ్ కు దూరమవుతాడని అంటున్నారు. ఇక అభిషేక్ శర్మ ఆడకపోతే, సంజు శాంసన్ కు బంపర్ ఆఫర్ తగులనుంది. అభిషేక్ స్థానంలో సంజు వచ్చేస్తాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాకముందే.. టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడ్డారు. మొదటగా తిలక్ వర్మ వృషణాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని… చివరి క్షణంలో టీమిండియా జట్టులో చేరాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ చేతికి గాయమైంది. అతడు ఇంకా జట్టులో చేరలేదు. ఇది మరవక ముందే టీమిండియా బౌలర్ హర్షిత్ రాణా కాలిగాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో హర్షిత్ రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగాడు. ఇక మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వైరల్ ఫీవర్ బుమ్రా సోకింది. ఇక ఇప్పుడు అభిషేక్ శర్మకు అనారోగ్యం చోటుచేసుకుంది. ఇలా అయితే టి20 ప్రపంచ కప్ గెలవడం కష్టమే అంటున్నారు.
Also Read: Inzamam-ul-Haq: USA బౌలర్లతో సూర్య గుసగుసలాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచలనం
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==