E-Paper
Advertisement

Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

Inzamam-ul-Haq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20i world cup 2026 ) నేపథ్యంలో నిన్న టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై చాలా కష్టంగా బయటపడింది. సూర్య కుమార్ యాదవ్ 84 పరుగులు సాధించకపోతే టీమిండియా ఓడిపోయేదే. అయితే చాలా కష్టంగా టీమిండియా గెలవడంపై పాకిస్తాన్ విషం కక్కుతోంది. ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( India vs. United States of America) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయిదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అమెరికా బౌలర్లతో సూర్య కుమార్ యాదవ్ సీక్రెట్ గా మాట్లాడాడని… ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయిందని ఆరోపణలు చేశారు. అందుకే ఇండియా గెలిచిందని.. లేకపోతే అమెరికా గెలిచేదని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్.

Also Read: Smriti Mandhana Mother: ప‌లాష్ పెద్ద మోస‌గాడు..వాడిపై ప‌గ‌తో నా బిడ్డ ఆడింది, RCB విజ‌యంపై స్మృతి త‌ల్లి పోస్ట్‌ వైర‌ల్ ( ICC Men’s T20 World Cup 2026)

USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అమెరికా జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అమెరికా జట్టుపై 29 పరుగులు తేడాతో విజయం సాధించింది టీం ఇండియా. ఈ విజయాన్ని కూడా చాలా కష్టపడి సాధించుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా జట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఫిక్సింగ్ చేస్తుందని.. అందుకే ఇండియా చేతిలో కావాలనే ఓడిపోయిందని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్.

టీమిండియా స్కోర్ 77 వద్ద ఉన్న సమయంలో 7 వికెట్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా జట్టుకు సంబంధించిన బౌలర్లతో సూర్య కుమార్ యాదవ్ గుసగుసలాడాడని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు ఇంజమామ్ వుల్ హక్. ఈ దెబ్బకు టీమిండియా స్కోర్ 160 కి పైగా దాటిపోయిందని వెల్లడించారు. ఫిక్సింగ్ జరగడం కారణంగానే సూర్య కుమార్ యాదవ్ 84 పరుగులు సాధించాడని తెలిపారు. లేకపోతే ఇండియా పై అమెరికా జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టేదని కూడా వివరించారు. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. వీళ్లకు ఆడడం చేతకాదని.. ఇండియా పైన ( TEam India) బురద జల్లడం మాత్రమే వచ్చు అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×