BigTV English

Trolls on RCB : RCB పై పాకిస్తాన్ కుట్రలు… ఈ సారి కప్పు గెలుస్తుంది అనుకుంటే… ఐపీఎల్ 2025 రద్దు అయ్యేలా ఉందే ?

Trolls on RCB : RCB పై పాకిస్తాన్  కుట్రలు… ఈ సారి కప్పు గెలుస్తుంది అనుకుంటే… ఐపీఎల్ 2025 రద్దు అయ్యేలా ఉందే ?

Trolls on RCB : ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాస్త ముందంజలో కొనసాగుతోంది. అయితే ఈసారి కప్ ఆర్సీబీదేనని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని మ్యాచ్ ల్లో అయితే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని.. అందుకే ఆర్సీబీ విజయం సాధిస్తుందనేలా మాట్లాడుకుంటున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సులువుగా గెలవాల్సిన చెన్నై జట్టు చివర్లో కీలక వికెట్లను కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తుంటే.. భారత్ తిప్పి కొడుతోంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ రద్దు అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ రద్దు కావడం లేదని స్పష్టం చేసింది.


Also Read : Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు

అయితే నిన్న జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో అటు ఢిల్లీకి ఇటు పంజాబ్ కి ఇది కీలక మ్యాచ్ కావడంతో రెండు జట్లు కాస్త నిరాశకు గురయ్యాయి. ఈ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారా..? లేక స్కోర్ ని షేర్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్  గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్ లోకి కూడా బెంగళూరు వెళ్ళింది. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే.. ఐపీఎల్ టోర్నమెంట్ రద్దయ్య ప్రమాదం పొంచి ఉంది.  అంటే ఈసారి కూడా బెంగళూరుకు కప్పు రాదన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.


ఈ సీజన్ లో ఆర్సీబీ జట్టు అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లు ఆడితే 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది. అయితే ఆర్సీబీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు కి ప్రధాన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతను ఆటకు దూరం కావాలసి వచ్చింది. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకుంది. మయాంక్ ని కోటీ రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక మయాంక్ అగర్వాల్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. పడిక్కల్ స్థానాన్ని మయాంక్ అగర్వాల్ భరిస్తారా లేదా అనేది ప్రస్తుతం అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే గత సీజన్లలో అంతగా రాణించలేదు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి అనుభవజ్ఞుల సమక్షంలో మయాంక్ మెరుగ్గా ఆడితే ఆర్సీబీకి ఇక తిరుగుండదు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించినప్పటికీ ప్లే ఆప్స్ లో టాప్ లో ఉండాలంటే విజయం సాధించాలి. 

?igsh=MW8wY282N2Z0b2tidA==

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×