E-Paper
Advertisement

ACCIDENTS : పండగ వేళ విషాదం.. సొంతూళ్లకు పయనమై తిరిగిరాని లోకాలకు..

ACCIDENTS : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే, పండుగ కోసం సొంతూళ్లకు పయనమై.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటనలు పలుచోట్ల జరిగాయి. రెండు రోజుల్లోనే వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

ACCIDENTS : పండగ వేళ విషాదం.. సొంతూళ్లకు పయనమై తిరిగిరాని లోకాలకు..
Advertisement

ACCIDENTS : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే, పండుగ కోసం సొంతూళ్లకు పయనమై.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటనలు పలుచోట్ల జరిగాయి. రెండు రోజుల్లోనే వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే యాక్సిడెంట్లు జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం టెన్త్ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో వోల్వా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు 32 మంది ప్రయాణికులతో వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Advertisement

అలాగే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పండుగ పూజ విషాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మురో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ రోడ్డు ప్రమాదంతో నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జునసాగర్‌ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని తిరిగి వస్తుండగా కంబాలపల్లి శివారులో ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

ఏడుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పల్లెలకెళ్లిన జనం మళ్లీ నగరం బాట పట్టేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు రవాణా అధికారులు. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండంతో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తిరిగి సేఫ్‌గా గమ్యానికి చేరుకోవాలని చెబుతున్నారు.

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×