E-Paper
Advertisement

Bandi Sanjay: హనుమకొండలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..

Bandi Sanjay: హనుమకొండలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
Advertisement

 

Bandi Sanjay

Advertisement

Attack on Bandi Sanjay Convoy: హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థతులు నెలకొన్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. హనుమకొండ జిల్ల భీమదేవరపల్లి మండలం వంగరలో ఈ ఘటన జరిగింది. పీవీ నరసింహారావు స్వగ్రామంలో పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక నాయకుడు పీవీ నర్సింహరావు అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఠీవీగా, పీవీ బహుభాషా కోవిదుడిగా, కవిగా, రచయితగా జర్నలిస్టుగా పని చేశాన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి దేశానికి ఎనలేని సేవలను చేశారని బండి సంజయ్ కొనియాడారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించిన ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానిదేనని కొనియాడారు.

Advertisement

పీవీ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా పీవీ ఆత్మను, ఆయన కుటుంబ సభ్యులను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. పీవీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అవమానించిందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం కూడా వ్యక్తం చేయలేదన్నారు. అనంతరం బండి సంజయ్ మల్కాపూర్ బయలు దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్ లోని మీడియా వాహనంపై పడ్డాయి దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read More: తిరుగువారంతో మేడారం జాతర ముగింపు.. పెరిగిన భక్తుల రద్దీ..

ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత అక్కర్లేదన్నారు. పోలీసులు కూడా తనతో రావద్దన్నారు. తన రక్షణ మొత్తం తమ కార్యకర్తలే చూసుకుంటారని ఆయన మండిపడ్డారు. అయితే కాన్వాయ్ పై కోడిగుడ్లు పడటంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×