Contract Teachers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో డీఎస్సీ-2008 సెకండరీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 1,181 మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.21,99,49,440 బడ్జెట్ను కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నెలకు రూ. 31,040 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ పొడిగింపునకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించింది. అభ్యర్థులతో కొత్తగా ఒప్పంద పత్రాలు రాసుకోవాలని నిర్ణయించింది.
వేతనాలు ఐఎఫ్ఎంఐఎస్-డీబీటీ ద్వారానే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకూడదని స్పష్టంచేసింది. ఖాళీల్లో కొత్త నియామకాలు చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.
Also Read: Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!