E-Paper
Advertisement

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!
Advertisement

Contract Teachers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో డీఎస్సీ-2008 సెకండరీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 1,181 మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

కొత్తగా ఒప్పంద పత్రాలు..

కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.21,99,49,440 బడ్జెట్‌ను కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నెలకు రూ. 31,040 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ పొడిగింపునకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించింది. అభ్యర్థులతో కొత్తగా ఒప్పంద పత్రాలు రాసుకోవాలని నిర్ణయించింది.

హైదరాబాద్ మినహా..

Advertisement

వేతనాలు ఐఎఫ్ఎంఐఎస్-డీబీటీ ద్వారానే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకూడదని స్పష్టంచేసింది. ఖాళీల్లో కొత్త నియామకాలు చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.

Also Read: Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×