Last day of Sammakka Sarakka Jatara(Local news telangana) : ఆతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం నిర్వహించే తిరుగువారంతో జాతర ముగుస్తోంది. ఈ తిరుగువారం కార్యక్రమానకి అధికారులు, పూజార్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజారులు పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులు వాటికి తాళాం వేస్తారు.
మండమెలిగే పండుగతో మొదలైన సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారంతో ముగుస్తుంది. మళ్లీ వచ్చే ఏడాది మినీ జాతర సందర్భంగా ఈ సామగ్రిని బయటకు తీసి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తుల రద్దీ పెరిగింది. దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారు అని సమాచారం. బుధవారం పూజలందుకున్న దేవతలు.. తిరుగువారం చేయడంలో జాతర ముగుస్తుంది.
Read More: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
నాలుగు రోజుల్లో కోటి 45 లక్షల మంది మేడారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో ముగుస్తుంది. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో వర్షం కురవడం ఈ జాతర విశేషం. దీంతో ప్రజలు శుభ సూచకంగా భావిస్తారు.