E-Paper
Advertisement

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ బీజేపీ. చిన్న మీటింగ్‌కు కూడా అధిష్టానం నుంచి అగ్రనేతలను దింపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ వంటి దిగ్గజ నేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించి జనాలకు హామీల మీద హామీలు గుప్పించారు.

ఇక త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలున్నారన్నారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 300 సీట్లు దాటిందని తెలిపారు.

తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్మమని వెల్లడించారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×