E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు
Advertisement

Delhi News: తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. విదేశాల్లో కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు ప్రజలు ప్రజలు. దేశ రాజధాని ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్జాస్ కళాశాల గ్రౌండ్‌లో వేడుకలు జరిగాయి. నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి కుటుంబాలు హాజరై సందడి చేశారు.

Advertisement

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ వేడుకకు హాజరై బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన. సీఎం రేఖా‌గుప్తాతో వేదికను పంచుకున్నారు ఆమె. జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాసన.. బతుకమ్మ కేవలం పూల పండుగ కాదన్నారు. మహిళా శక్తికి-సామాజిక ఐక్యతకు-సృజనాత్మకతకు అద్దం పడుతుందన్నారు. దసరాతో ముడిపడిన ఈ వేడుక ఉత్సాహాన్ని-విజయాన్ని సూచిస్తుందన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలు మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా ఉందన్నారు.

Advertisement

ALSO READ:  ఆ జిల్లాలకు హైఅలర్ట్.. ఉరుములు, పిడుగులు పడే ఛాన్స్

తెలంగాణ సంస్కృతిని గౌరవించినందుకు సీఎం రేఖా గుప్తాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఏ ప్రెసిడెంట్, సలహాదారుల పర్యవేక్షణలో ఈ బతుకమ్మ సంబరాల వేడుక అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సంప్రదాయ పూజలు, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసనను నిర్వాహకులు జ్ఞాపికతో సత్కరించారు. ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల మధ్య ఐక్యత, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసింది. మొత్తానికి ఈసారి ఢిల్లీలో జరిగిన వేడుకలు బాగా జరిగాయని హాజరైన తెలుగు ప్రజలు చెప్పడం గమనార్హం.

అటు విదేశాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.  న్యూజిలాండ్ మొదలు అమెరికా వరకు తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహించారు కూడా.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×