E-Paper
Advertisement

CM Revanth Reddy: అంబర్ పేట్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అంబర్ పేట్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో.. మౌలిక వసతుల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం అంబర్‌పేట్‌లో రూ. 539.23 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆధునిక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) ను ప్రారంభించి, మరో 5 ప్రాంతాల్లో పూర్తయిన ప్లాంట్లను కూడా ప్రజలకు అందించారు. ఇదే సందర్భంలో మొత్తం రూ. 3,849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు.

ఇప్పటికే ప్రారంభమైన ఎస్టీపీలు

అంబర్‌పేట్ ఎస్టీపీ – రూ. 319.43 కోట్లతో, 212.50 MLD సామర్థ్యం. ఇది హైదరాబాద్‌లోనే అతిపెద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌గా నిలుస్తుంది.

అత్తాపూర్ ఎస్టీపీ (రాజేంద్రనగర్) – రూ. 109.24 కోట్లతో, 64 MLD సామర్థ్యం.

ముల్లకతువా ఎస్టీపీ (కూకట్‌పల్లి) – రూ. 44.46 కోట్లతో, 25 MLD సామర్థ్యం.

శివాలయ నగర్ ఎస్టీపీ (కుత్బుల్లాపూర్) – రూ. 34.13 కోట్లతో, 14 MLD సామర్థ్యం.

వెన్నలగడ్డ ఎస్టీపీ (కుత్బుల్లాపూర్) – రూ. 13 కోట్లతో, 10 MLD సామర్థ్యం.

పాలపిట్ట ఎస్టీపీ (శేరిలింగంపల్లి) – రూ. 18.97 కోట్లతో, 07 MLD సామర్థ్యం.

ఈ ఆరు ప్లాంట్లు ప్రారంభమవడంతో నగరంలో సుమారు 333 MLD మలిన జలాలను శుద్ధి చేసే సామర్థ్యం పెరిగింది. దీనితో ముసీ నది కాలుష్యాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను రక్షించడం సాధ్యమవుతుంది.

కొత్తగా శంకుస్థాపన చేసిన ఎస్టీపీలు

హైదరాబాద్‌లో మలిన జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికను అమలు చేస్తున్నారు.

ప్యాకేజీ-1: రూ. 1878.55 కోట్లతో 16 ఎస్టీపీలు

ప్యాకేజీ-2: రూ. 1906.44 కోట్లతో 22 ఎస్టీపీలు

PPP మోడల్: రూ. 64.11 కోట్లతో 1 ఎస్టీపీ

మొత్తం 39 ఎస్టీపీలు పూర్తయితే నగరంలో ఉత్పత్తి అయ్యే సుమారు.. 1,950 MLD మలిన జలాలన్నింటిని శుద్ధి చేసే సామర్థ్యం హైదరాబాద్‌కి లభిస్తుంది.

ముఖ్యమంత్రి ప్రసంగం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటంలో ఎస్టీపీల నిర్మాణం కీలకమైన అడుగు. కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు శుభ్రమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని అన్నారు.

Also Read: 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటో చూపిస్తా!

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మలిన జలాల శుద్ధి అత్యవసర అవసరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఎస్టీపీ ప్రాజెక్టులు.. నగరానికి భవిష్యత్తులో పెద్ద ఉపశమనాన్ని ఇవ్వబోతున్నాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు మాత్రమే కాకుండా, హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతకు కూడా దోహదం చేస్తుంది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×