E-Paper
Advertisement

CM Revanth Reddy: ఆ రెండు ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

CM Revanth Reddy: ఆ రెండు ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి ఆదేశాలు
Advertisement

CM Revanth Reddy: పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన అమానుష ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ డీజీపీని ఆదేశించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.

Also Read: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

Advertisement

అదేవిధంగా, నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉట్కూర్ మండలంలో పట్టపగలు సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదిలేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు చేశారు.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×