E-Paper
Advertisement

TTD: టీటీడీ ఈవోగా శ్యామలరావు నియామకం

TTD: టీటీడీ ఈవోగా శ్యామలరావు నియామకం
Advertisement

TTD EO: TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో శ్యామలరావును నియమించింది. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు.. శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read: టీచర్ టూ హోం మినిస్టర్.. వంగలపూడి అనిత ప్రస్థానమిదే..

Advertisement

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయ్యిందని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడుతామని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విధితమే. ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జే శ్యామలరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×