Big Stories

Drugs in Punjagutta: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ లభ్యం.. ఇద్దరు అరెస్ట్!

- Advertisement -

Drugs Seized in Punjagutta Hyderabad: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పంజాగుట్ట పోలీసులు చేధించారు. పాలస్తీనాకు చెందిన సయూద్‌ అలీ, ముంబైకి చెందిన రోమిలను అరెస్ట్‌ చేశారు. రెండ్రోజుల క్రితం పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ వద్ద.. సయూద్‌ కి.. రోమీ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్ట్ససీ పిల్స్‌, 5.18 గ్రాముల ఎండీఎంఏ.. 109 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

నిందితులకు హైదరాబాద్,ఢిల్లీ, బెంగళూరు, గోవాలోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నారు. స్టూడెంట్‌ వీసాపై వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న సయూద్‌.. మనీ కోసం డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. సయూద్ ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అందిస్తున్నట్టు విచారణలో తేల్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News