E-Paper
Advertisement

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident: హైదరాబాద్‌ నాగోల్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి, తన తండ్రితో బైక్‌పై బయటకు వెళ్లాడు. నాగోల్ గౌరెల్లి పాపన్న గూడా చౌరస్తా వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో టిప్పర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. టిప్పర్‌ ముందు భాగం దగ్ధమవ్వడంతో పాటు బైక్‌ కూడా కాలి బూడిదైంది. బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంటి యజమాని, కొడుకు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ ఇల్లాలు ఒంటరైంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×