BigTV English

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.


బుధవారం గ్రేటర్‌లోని పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారాయన.

మూసీ అభివృద్ధి, హైడ్రా విషయంలో అవగాహన, ఆలోచన లేకుండా దూకుడుగా వెళ్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. దీనివల్ల పేద, మధ్య దిగువ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదన్నది ఆయన మాట. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ లేదన్నారు.


మూసీ పరివాహన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని ఇప్పుడు వాళ్లే కూలగొడుతున్నారని విమర్శించారు. మూసీ పేరిట దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. వంద శాతం కెపాసిటీ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మాణం చేపట్టామన్నారు. వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.

ALSO READ: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

పనిలోపనిగా పెండింగ్ బకాయలు ఇవ్వలేదని, వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు 80 వేల కోట్ల దాటిందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నా రు. గతంలో చెప్పినట్టుగానే అబద్దాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారాయన. ఖమ్మం, మహబూబాబాద్ ల్లో వరదల వల్ల నష్టపోయినవారికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

Related News

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Srushti Hospital: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

Big Stories

×