E-Paper
Advertisement

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం
Advertisement

KTR on Musi River: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

బుధవారం గ్రేటర్‌లోని పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారాయన.

Advertisement

మూసీ అభివృద్ధి, హైడ్రా విషయంలో అవగాహన, ఆలోచన లేకుండా దూకుడుగా వెళ్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. దీనివల్ల పేద, మధ్య దిగువ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదన్నది ఆయన మాట. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ లేదన్నారు.

మూసీ పరివాహన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని ఇప్పుడు వాళ్లే కూలగొడుతున్నారని విమర్శించారు. మూసీ పేరిట దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. వంద శాతం కెపాసిటీ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మాణం చేపట్టామన్నారు. వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.

Advertisement

ALSO READ: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

పనిలోపనిగా పెండింగ్ బకాయలు ఇవ్వలేదని, వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు 80 వేల కోట్ల దాటిందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నా రు. గతంలో చెప్పినట్టుగానే అబద్దాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారాయన. ఖమ్మం, మహబూబాబాద్ ల్లో వరదల వల్ల నష్టపోయినవారికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×