E-Paper
Advertisement

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం
Advertisement

KTR on Musi River: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

బుధవారం గ్రేటర్‌లోని పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారాయన.

Advertisement

మూసీ అభివృద్ధి, హైడ్రా విషయంలో అవగాహన, ఆలోచన లేకుండా దూకుడుగా వెళ్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. దీనివల్ల పేద, మధ్య దిగువ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదన్నది ఆయన మాట. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ లేదన్నారు.

మూసీ పరివాహన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని ఇప్పుడు వాళ్లే కూలగొడుతున్నారని విమర్శించారు. మూసీ పేరిట దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. వంద శాతం కెపాసిటీ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మాణం చేపట్టామన్నారు. వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.

Advertisement

ALSO READ: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

పనిలోపనిగా పెండింగ్ బకాయలు ఇవ్వలేదని, వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు 80 వేల కోట్ల దాటిందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నా రు. గతంలో చెప్పినట్టుగానే అబద్దాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారాయన. ఖమ్మం, మహబూబాబాద్ ల్లో వరదల వల్ల నష్టపోయినవారికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×