E-Paper
Advertisement

Kurian Committee Review: కురియన్ కమిటీ రివ్యూ, తొలి రోజు 17మంది ఎంపీ అభ్యర్థులతో..

Kurian Committee Review: కురియన్ కమిటీ రివ్యూ, తొలి రోజు 17మంది ఎంపీ అభ్యర్థులతో..
Advertisement

Kurian Committee Review(TS today news): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేస్తోంది కురియన్ కమిటీ. గురువారం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంది ఈ కమిటీ. ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా గాంధీభవన్‌కు వెళ్లింది.

గెలిచిన, ఓడిన ఎంపీ అభ్యర్థులతో చర్చిస్తోంది కురియన్ కమిటీ. పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ విడివిడిగా మాట్లాడుతోంది. ఒకొక్కరికీ దాదాపు 30 నిమిషాల సమయాన్ని సమయాన్ని కేటాయించా రు. టికెట్ రాని నేతలు సైతం తమ వాదనలను కురియన్ కమిటీకి వినిపించనున్నారు. తొలుత  సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ తన వాదనలు వినింపించారు.

Advertisement

పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు? నియోజకవర్గాల పరిధిలోని వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? అసెంబ్లీ-పార్లమెంటుకు నియోజకవర్గాల్లో ఓటింగ్ తేడా వస్తే.. ఎందుకు వచ్చింది? అనేదానిపై అభ్యర్థుల నుంచి వివరాలు సేకరిస్తోంది. రెండు లేదా మూడురోజుల పాటు కమిటీ  హైదరాబాద్‌లో మకాం వేయనుంది.

ఒక్క తెలంగాణకే కాదు.. మధ్య‌ప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది కాంగ్రెస్ పార్టీ. వీలైతే ఆయా నియోజకవర్గాల్లో కమిటీ పర్యటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి అంశాలతో కూడిన నివేదిక కాంగ్రెస్ హైకమాండ్‌కు అందజేయ నుంది.

Advertisement

ALSO READ: కేటీఆర్ ఇలా దొరికిపోతారని అనుకోలేదా?

ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీ ఎక్కడ, ఏయే విషయాల్లో వెనుకబడింది? అనేదానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఈలోగా వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను నియమించే ఛాన్స్ ఉంది. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసేందుకు అంచెలంచెలుగా చర్యలు చేపట్టనున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకోవడంతో ఈసారి 250 సీట్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నమాట.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×