E-Paper
Advertisement

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?
Advertisement

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ అవుతోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు ఉండేలా ఫ్యామిలీ కార్డు అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధులు ఒకే కార్డు ద్వారా అందేలా, ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన చేస్తున్న ఈ కార్డు రాబోయే నెలల్లో ప్రజల చేతుల్లోకి రానుంది. ఇకపై పథకాల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా, ఒక్క కార్డుతోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి సంబంధించిన విధానాలను మరింత సులభతరం చేస్తూ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ సిస్టమ్ (FBMS) పై విస్తృత చర్చ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకే కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రతి ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రజలు పథకాల కోసం ఇబ్బందులు పడకుండా, ఒకే కార్డుతో అన్ని సేవలు పొందగలిగేలా సిస్టమ్‌ను డిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఆధార్ ఆధారిత ఫ్యామిలీ కార్డు రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించిన చంద్రబాబు, కార్డు వివరాలు సమగ్రంగా, ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ పథకం లబ్ధి అందినప్పుడు, మిగతా సభ్యులకు ప్రతిబింబించేలా, డేటాబేస్ అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో పలు పథకాల కోసం కుటుంబాలు విడిపోయి వేర్వేరు డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సిన పరిస్థితి ఉందని గుర్తించిన సీఎం, ఇకపై అలాంటి సమస్యలు రాకుండా స్కీమ్‌లను రీడిజైన్ చేయాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో పారదర్శకత, సమర్థత ముఖ్యమైనవి. అందుకే ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు ఉండేలా ఈ కార్డు కీలకంగా మారుతుందని ఆయన అన్నారు.

ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా పింఛన్లు, రేషన్, ఆరోగ్య పథకాలు, విద్యా సదుపాయాలు, సబ్సిడీలు వంటి అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధులు ఒకే సిస్టమ్‌లో రికార్డ్ చేయబడతాయి. తద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా, పథకాలు అందరికీ సమానంగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, ఈ కార్డు వల్ల కుటుంబాల పూర్తి డేటాబేస్ సిద్ధం అవుతుందని, భవిష్యత్‌లో పథకాలను మరింత సులభంగా అమలు చేయవచ్చని వివరించారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డేటాను సమన్వయం చేసి, పారదర్శక పాలనను సాధించవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ కార్డుల పంపిణీ జరుగుతుందని, రాబోయే కొన్ని నెలల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. భవిష్యత్‌లో ఈ కార్డు ఆధారంగా పలు పథకాల రిజిస్ట్రేషన్, పునరుద్ధరణలు కూడా సులభతరం కానున్నాయి.

సీఎం చంద్రబాబు ఈ కార్డు రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, తక్కువ సమయంతో ఈ సేవలను అందించాలి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని సీఎం అన్నారు.

Also Read: Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

ఫ్యామిలీ కార్డు సౌకర్యం అందుబాటులోకి రాగానే, ప్రభుత్వ పథకాలపై అనుమానాలు, మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని, ప్రజలకు నేరుగా లబ్ధి చేరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ కార్డు ఆధారంగా పథకాల కేటాయింపులు ఆటోమేటిక్‌గా జరిగి, అనర్హులకు లబ్ధి చేరకుండా సిస్టమ్‌ను కఠినతరం చేయాలని సీఎం సూచించారు.

ఇకపై ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కూడా ఈ కార్డు ద్వారా సులభం కానుంది. ఎవరు ఏ పథకం పొందుతున్నారో, ఏ పథకానికి అర్హులై ఉన్నారో తేలికగా గుర్తించవచ్చు. ఈ డేటా ఆధారంగా కొత్త పథకాలు రూపకల్పన చేయడంలోనూ, ఉన్న పథకాల్లో మార్పులు చేయడంలోనూ ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు ఈ ఫ్యామిలీ కార్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రజలకు సమగ్ర లబ్ధి అందించడంలో ఇది చారిత్రాత్మక నిర్ణయమని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ కార్డులను దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించగా, వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారదర్శక పాలనలో మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×