E-Paper
Advertisement

మణుగూరు పట్టణం.. మంటల్లో వాహనాల షోరూం, తగలబడిన ఐదు కార్లు

మణుగూరు పట్టణం.. మంటల్లో వాహనాల షోరూం, తగలబడిన ఐదు కార్లు
Advertisement

Manuguru town: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. మణుగూరు పట్టణంలోని గుట్ట మల్లారం ప్రాంతంలో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మరింత నష్టం జరగకుండా కాపాడారు.

మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం బైక్ షోరూం పక్కన కార్ మెకానిక్ షెడ్‌ ఉండి. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్‌లో ఉన్న కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని కార్లు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. మంటల విషయం తెలియగానే స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే షోరూమ్ వ్యక్తికి సమాచారం ఇచ్చారు.

Advertisement

అటు ఫైర్ ఇంజన్లకు సమాచారం చేరవేశారు. అయితే  అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ కాస్త మొరాయించినట్టు తెలిసింది. ఇంజిన్ పని చేయకపోవడంతో నీరు రావడం కష్టంగా మారింది. స్థానికులు నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంట తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కార్లతోపాటు షాపులోని స్పేర్ పార్టులు కాలిపోయినట్టు షాపు యజమాని తెలిపారు. కేవలం సామానుల విలువ 4 లక్షల వరకు ఉంటుందని షెడ్డు నిర్వాహకులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

దారుణం.. కారుకు అడ్డంగా నిలబడ్డాడని యూ టర్న్ తీసుకుని వ‌చ్చి మరీ కారుతో ఢీకొట్టి హత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ, స్పాట్‌లో 10 మంది!

భాగ్యనగరంలో బోనాల సంబురం.. గోల్కొండ కోటలో తొలి బోనంతో షురూ అయిన జాతర

Kothagudem Hospital: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. నిలబడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. మరో కొత్త సేవలు!

Karimnagar: మరీ ఇంత దారుణమా.. నెంబర్ లేని జేసీబీతో పొలంలో ఉన్న రైతు పై దాడి!

Revanth Reddy: వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×