Mohammad Kaif: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs. England ) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గొడవలు జరుగుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు గంభీర్ కు దూరంగా ఉంటూ… కేవలం సీనియర్ క్రికెటర్లతో మాత్రమే విరాట్ కోహ్లీ గడుపుతున్నాడట. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) సీరియస్ అయ్యారు.
పొద్దున లేస్తే గౌతమ్ గంభీర్ కు గొడవలు కావాలంటూ ఆగ్రహించారు. విరాట్ కోహ్లీ అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు గొడవలు (Kohli-Gambhir Rift) పెట్టుకుంటే… టీమిండియా ఎక్కడ గెలుస్తుందని నిలదీశారు. ఇంత జరుగుతున్న బీసీసీఐ ముద్దు నిద్ర వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీరిద్దరి మధ్య ఉన్న గొడవపై బీసీసీఐ విచారణ చేసి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా జట్టులో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ వ్యవహారంపై విరాట్ కోహ్లీ చాలా సీరియస్ గా ఉన్నారట. తనను 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పించే ప్రయత్నం చేశారని గౌతమ్ గంభీర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ కైఫ్ తన స్టైల్ లో స్పందించారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ అటు విరాట్ కోహ్లీ ఇద్దరు గొడవపడడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరు గొడవపడితే 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన గుండు సున్నా కావడం గ్యారంటీ అన్నారు.
గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచే టీమిండియా కసరత్తులు ప్రారంభించాలి… విదేశీ గడ్డలపై ఎక్కువ వన్డేలు ఆడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు గొడవపడడం టీమిండియా కు పెద్ద దెబ్బ అని హెచ్చరించారు. విదేశీ గడ్డలపై టీమిండియా ఆడే వన్డే మ్యాచ్ లలో గెలవాలంటే సీనియర్ల సలహాలు వాళ్ళ ఆట తీరు అవసరం అన్నారు. అలాంటిది గంభీర్ అనవసరంగా విరాట్ కోహ్లీ తో గొడవపడి టీమిండియా పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై వెంటనే బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు మహమ్మద్ కైఫ్.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
🚨 Reports claim that Virat Kohli and Gautam Gambhir haven't been on talking terms since the end of the Champions Trophy 2025. 👀 pic.twitter.com/H9ewV6opvS
— GBB Cricket (@gbb_cricket) July 14, 2026