E-Paper
Advertisement

Hyderabad: మిస్టరీ సూసైడ్.. క్షుద్రపూజలే కారణమా?

Hyderabad: మిస్టరీ సూసైడ్.. క్షుద్రపూజలే కారణమా?
hyd student

Hyderabad student death news(TS news updates): హైదరాబాద్‌లో ఓ విద్యార్దిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. భరత్‌నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 430 మార్కులతో డా.అంబేద్కర్ జూనియర్ కాలేజీలో టాపర్‌గా నిలిచింది. ఎప్పుడు చురుకుగా, చలాకిగా ఉండే నవ్య.. ఆత్మహత్య చేసుకోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నవ్య తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డపై క్షుద్రపూజలు చేసి చంపారని ఆరోపిస్తున్నారు. ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నల్లబొమ్మ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చనిపోయిన రోజు కూడా నవ్య అందరితో కలివిడిగానే ఉందని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెబుతున్నారు పేరెంట్స్. ఎప్పుడూ చురుకుగా ఉండే నవ్య ఇలా సడెన్‌గా సూసైడ్ చేసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలు చేసే ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే, క్షుద్రపూజల భయంతో నవ్య మానసికంగా కృంగి పోయిందని.. ఆ వ్యథతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి ముందు క్షుద్రపూజలు చేసింది ఎవరని ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Big Stories

×