Vada Secret: భారతీయుల వంటకాల్లో ప్రధానమైన చెల్లి గారె అలియాస్ వడ. కళ్ల చూస్తే వాటిని తినేయాలని పిస్తుంది. బయట కరకరలాడు తున్నా, లోపల చాలా మెత్తగా ఉంటాయి. కొందరు చట్నీతో.. మరికొందరు సాంబార్తో, ఇంకొందరు చికెన్ గ్రేవీతో లాగించేస్తుంటారు. ఆ విధంగా తింటే ఆ టేస్ట్ వేరని చెబుతారు. కానీ ఇక్కడే ఒక ప్రశ్న. వడ మధ్యలో ఎందుకు చిల్లు పెడతారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే.
భారతీయ వంటకాల్లో ప్రత్యేకం-భారతీయ వంటకాలకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని పూర్వం నుంచి వస్తుంటాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అల్లుళ్లకు ఆ తరహా వంటకాలు చేస్తుంటారు అత్తింటివారు. వాటిలో చిల్లి గారె ఒకటి. ఈ రకం వంటకానికి బలమైన కారణం ఉంది. భోజనానికి ముందు వీటిని పెడతారు. వడకు మధ్య రంధ్రం చేస్తారు. దీన్ని సాంప్రదాయ లక్షణం లేకుంటే డిజైన్గా భావిస్తారు.
వడకు మధ్యలో రంధ్రం ఎందుకు? వాస్తవానికి దాని వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం కూడా ఉంది. గారెకి చిల్లు పెట్టడం అలంకరణ కోసం కాదు. వడ రుచిని, ఆకృతిని వండే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధ్యలో చిల్లు ఉండడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం చాలానే ఉన్నాయి. బయట కరకరలాడుతున్న లోపల బాగా ఉడుకుతుంది. చిల్లు లేకుంటే వడ పెద్దగా ఉండడం వల్ల సరిగా ఉడకక పోవచ్చు.
వడకు చిల్లు వెనుక అసలు కథ-ఎందుకంటే నిత్యం మనం హోటళ్లలో మైసూర్ బొండా చూస్తుంటాము. మధ్యలో ఉడకపోవడం వల్ల చాలామంది దాన్ని పారేస్తుంటారు. వడకు చిల్లు పెట్టడం వల్ల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. దానివల్ల అన్ని వైపులా సమానంగా బంగారు రంగులో కనిపిస్తుంది. వడకు మధ్య భాగం చెల్లు ఉండడం వల్ల గట్టిపడదు. వేడి లోపలికి వేగంగా చొచ్చుకుపోయి వంట సమయాన్ని తగ్గిస్తుంది.
ALSO READ: 60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే
అంతేకాదు తక్కువ నూనె పీల్చుకుంటుంది. చేతితో తయారు చేసినప్పుడు వాటికి ఆకారం ఇవ్వడం ఈజీ అవుతుంది. రంధ్రం వల్ల వాటిని నూనెలో తిప్పడం సులభం అవుతుంది. ఈ పద్ధతి తరతరాలుగా వస్తూనే ఉంది. ఆ రంధ్రం కేవలం ఆచరణాత్మకమైనదే కాదు, వడ గుర్తింపులో అది కూడా ఓ భాగం. ఆ రంధ్రం లేకుంటే ఉడకడం సమయం పడుతుంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా-ఈలోగా వడ నల్లగా మారే అవకాశం ఉంటుంది. చిల్లు పెట్టడం వల్ల ఓ వైపు వేడి, మరోవైపు నూనె సమానంగా అందులోకి చొచ్చుకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే వడ అసలు సీక్రెట్. ఈ వంటకం ఎక్కువగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడులో అయితే ప్రత్యేకంగా మిరియాలు వేస్తారు. దానివల్ల వేగంగా జీర్ణం అవుతుందని అక్కడివారి నమ్మకం.