E-Paper
Advertisement

New DGP Shivdhar Reddy: ఈ రెండు సమస్యల మీదే ఫుల్ ఫోకస్.. తెలంగాణ కొత్త DGP శివధర్‌రెడ్డితో ఎక్స్‌క్లూజివ్

New DGP Shivdhar Reddy: ఈ రెండు సమస్యల మీదే ఫుల్ ఫోకస్.. తెలంగాణ కొత్త DGP శివధర్‌రెడ్డితో ఎక్స్‌క్లూజివ్
Advertisement

New DGP Shivdhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. (డీజీపీ)గా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలు, భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్రంలో ఉన్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంపై వివరించారు.

డీజీపీగా నియామకం పట్ల ఆనందం

Advertisement

డీజీపీగా నియమించబడిన తర్వాత శివధర్ రెడ్డి మాట్లాడుతూ..  ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి నుంచి డీజీ స్థాయి వరకు పనిచేసిన అనుభవం నాకు ఉంది. రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నందున, గతంలో ఉన్న అధికారుల మంచి అనుభవాలను తీసుకొని ముందుకు వెళ్తాను అని తెలిపారు.

డ్రగ్స్ సమస్యపై కఠిన చర్యలు

Advertisement

శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని చెప్పారు. డ్రగ్స్ ఇప్పుడు ఒక మహమ్మారి లాగా మారింది. కేవలం పోలీసులు మాత్రమే దీనిని నిర్మూలించలేరు. ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం. ఈగల్ టీమ్ ద్వారా డ్రగ్ మాఫియాపై ఇప్పటికే బలమైన చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరింత కఠిన చర్యలు చేపడతాం. విద్యార్థులు, యువతలో అవగాహన పెంచేందుకు.. ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అని అన్నారు.

సైబర్ క్రైమ్ — పెరుగుతున్న సవాలు

సైబర్ క్రైమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. మోసపూరిత ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ స్కామ్‌లు, సోషల్ మీడియా మోసాలు చాలా పెరిగాయి. తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ విభాగం బలంగా ఉంది. మన దగ్గర ఉన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఇప్పటివరకు అనేక నేరాలను అరికట్టగలిగాం. ఇకపై టెక్నాలజీ ఆధారంగా మరింత ముందడుగు వేస్తాం. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నేరాలను సులభంగా నివారించవచ్చు అని సూచించారు.

మావోయిస్టు సమస్యపై దృష్టి

మావోయిజం తెలంగాణ రాష్ట్రానికి.. ఒకప్పుడు పెద్ద సవాలుగా ఉండేది. ఈ సందర్భంలో ఆయన వివరించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాలు, ముఖ్యంగా ములుగు ప్రాంతాల్లో కొంతమేర మావోయిస్టు చలనం ఇంకా ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాల్లో మావోయిజం తీవ్రంగా బలహీనపడింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు సంవత్సరాల్లో 30 మంది పెద్ద మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న 70 మంది మావోయిస్టులను కూడా లొంగిపడేలా చర్యలు చేపడతాం అని తెలిపారు.

Also Read: దయచేసి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోకండి : మంత్రి పొన్నం

డీజీపీ శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో.. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్, మావోయిస్టు సమస్యలపై ఆయన స్పష్టమైన దృష్టి, అనుభవం, ప్రజలతో కలసి పనిచేయాలన్న కృతనిశ్చయం భవిష్యత్‌లో రాష్ట్ర శాంతి భద్రతకు కొత్త దిశను చూపుతుందనే నమ్మకం కలుగుతోంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×