E-Paper
Advertisement

Dasara 2025: అయ్యయ్యో.. మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. దసరా రోజున వైన్‌షాపులు బంద్..!

Dasara 2025: అయ్యయ్యో.. మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. దసరా రోజున వైన్‌షాపులు బంద్..!

Dasara 2025: తెలంగాణలో దసరా అంటే సుక్కా.. ముక్కా.. అలాంటి పండుగ ఈ సంవత్సరం గాంధీ జయంతీ రోజున వచ్చింది. అయితే గాంధీ జయంతి రోజు అహింస మార్గంలో నడవాలని ఆ ఒక్కరోజూ దేశమంత మందు, మాంసానికి దూరంగా ఉంటారు. కానీ ఈ సారి పండుగ, గాంధీ జయంతీ రెండు ఒకేరోజూ రావడంతో ప్రజలు చాలా కన్ఫ్యుజన్‌లో ఉన్నారు. అయితే పండుగ గాంధీ జయంతీ రోజున సందర్భంగా ఐదు రోజుల ముందు నుంచే ప్లేక్సీల రూపంలో ఆక్టోబర్ 2 మందు, మాంసం అమ్మరాదు అని ప్రకటించారు.

దసరా, గాంధీ జయంతి.. ఈ రోజు ఏం జరగబోతుంది..
ఈ ఏడాది 2025లో దసరా పండుగ, మహాత్మా గాంధీ జయంతి రెండూ అక్టోబర్ 2నే జరుగుతున్నాయి. ఇది 2006 తర్వాత మళ్లీ జరుగుతున్న అరుదైన సందర్భం. దసరా హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష దశమి తిథిపై జరుగుతుంది. అయితే గాంధీ జయంతి ఫిక్స్‌డ్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2నే ఉంటుంది. ఈ సమానత్వం వల్ల దేశవ్యాప్తంగా ఈ రోజు జాతీయ సెలవు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో దసరా విహారాలు కూడా అక్టోబర్ 2 వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజులు బంద్, తెలంగాణలో 13 రోజులు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేస్తారు.

వైన్స్, నాన్ వేజ్ బంద్ చేయాలని ఆదేశాలు..
ఈ ప్రత్యేక సందర్భంలో, గాంధీజీ అహింసా, మద్యపానం వ్యతిరేక సిద్ధాంతాలకు గౌరవంగా, దసరా పవిత్రతకు సంబంధించి దేశవ్యాప్తంగా ‘డ్రై డే’ ప్రకటించారు. అంటే, అక్టోబర్ 2న అన్ని వైన్ షాపులు, బార్లు, టాడీ షాపులు, లిక్కర్ షాపులు పూర్తిగా బంద్. మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లు కూడా మూసివేయాలని ప్రకటించారు. ఇది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్‌లు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లు కలిసి అమలు చేశారు. అంతేకాకుండా బెంగళూరులో BBMP మాంసం అమ్మకాలపై పూర్తి నిషేధం ప్రకటించింది, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వైన్ షాపుల బంద్‌ను ఆదేశించింది. అలాగే ఢిల్లీలో కూడా అక్టోబర్ 2న లిక్కర్ షాపులు మూసివేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ ఆర్డర్‌లు అమలులో ఉన్నాయి. తెలంగాణలో GHMC మాంసం, బీఫ్ షాపులు బంద్ చేయాలని ఆదేశించింది.

ఆదేశాలను ఉల్లంఘిస్తే.. తక్షణమే కేసు..
వైన్ షాపుల బంద్‌పై ఐదు రోజుల ముందే, అంటే సెప్టెంబర్ 27 నుంచి ప్లేక్సీలు, బ్యానర్లు, స్థానిక పత్రికలు ద్వారా ప్రకటించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు షాపు ఓనర్స్‌కి వ్యక్తిగతంగా హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 2న వైన్ షాపులు లేదా మాంసం దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తే, పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశాంచారు.

Also Read: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

మందు బాబుల కష్టాలు..
ఈ బంద్ ప్రకటనలు చూసిన మందు బాబులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి లేదా దసరా విడిగా ఉన్నప్పుడు ఒక్క రోజు బంద్‌తో ముగిసేది, కానీ ఇప్పుడు రెండు పండుగల కలిసి ఉండటంతో ‘డబుల్ షాక్’ అనిపిస్తోంది. దసరా విహారాలు సెప్టెంబర్ చివరి నుంచి ఉన్నా, అక్టోబర్ 2 వరకు మొత్తం 10-13 రోజులు లిక్కర్ అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది ఆల్కహాలిక్స్ ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో “ఈ రోజు మాత్రమే తాగాలని” అనుకున్నవారు నిరాశకు గురవుతున్నారు. కొందరు బ్లాక్ మార్కెట్‌లో రూ.500-1000కు బాటిల్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ పోలీసులు ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×