E-Paper
Advertisement

NTR: ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్‌.. పువ్వాడ పొలిటికల్ స్టాట్యూ!

NTR: ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్‌.. పువ్వాడ పొలిటికల్ స్టాట్యూ!
Advertisement

NTR: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కలిశారు. మే 28 ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ముఖ్యఅతిథిగా రావాలని ఎన్టీఆర్‌ను పువ్వాడ ఆహ్వానించారు.

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టాలీవుడ్ హీరో, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరపనుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ… జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు.

Advertisement

ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. శ్రీకృష్ణుడి రూపంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో, ఆ రోజున ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వెనుక రాజకీయ కోణం వెతుకుతున్నారు. ఖమ్మంలో ఏపీ, తెలంగాణ మిక్స్‌డ్ వాతావరణం ఉంటుంది. ఓ వర్గం ఆధిపత్యమూ ఎక్కువే. అందుకే, వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారనే రాజకీయ విమర్శలూ వినిపిస్తున్నాయి.

Advertisement

మరోవైపు, ఇటీవలే కొమురంభీం ఎన్టీఆర్‌తో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే బీజేపీ స్కెచ్ అని అన్నారు. మీరేనా.. మేము సైతం అంటూ.. ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్‌ను రప్పించి.. ఆయన క్రేజ్‌ను తమ ఓటు బ్యాంక్‌గా మార్చుకోవాలని చూస్తున్నారని కూడా అంటున్నారు. తాత విగ్రహం కాబట్టి మనువడిని పిలుస్తున్నాం.. అనేది పువ్వాడ వెర్షన్. ఏదిఏమైనా.. ఈమధ్య అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తుండటం ఆసక్తికరం.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×