![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/sravnathi-1.jpg)
Palvai Sravanti : సీఎం కేసీఆర్ ను కలిశారని వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి క్లారిటీ ఇచ్చారు. ఆమె కేసీఆర్ను కలిసినట్లుగా బుధవారం రాత్రి నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఆమె స్పందించారు. తనను ఓడించడానికి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి అధికారులను కోరారు.
- Advertisement -