Big Stories

Palvai Sravanti : కేసీఆర్ తో భేటీ వార్తలపై పాల్వాయి స్రవంతి క్లారిటీ.. వాళ్లపై ఈసీకి ఫిర్యాదు

Palvai Sravanti : సీఎం కేసీఆర్ ను కలిశారని వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి క్లారిటీ ఇచ్చారు. ఆమె కేసీఆర్‌ను కలిసినట్లుగా బుధవారం రాత్రి నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆమె స్పందించారు. తనను ఓడించడానికి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి అధికారులను కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News