Big Stories

Bandi Sanjay : మునుగోడు వెళ్లకుండా బండి సంజయ్‌ అడ్డగింత..అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay : మునుగోడు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బండి సంజయ్‌ బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. తొలుత మలక్ పేట సమీపంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా బండి సంజయ్ ముందుకెళ్లారు. మరోసారి వనస్థలిపురం వద్ద నిలువరించారు. అయినా కార్యకర్తల సహకారంతో బండి సంజయ్ కాన్వాయ్‌ ముందుకు సాగింది. చివరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆపారు. బండి సంజయ్ ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొంత సమయం ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News