Hyderabad City: హైదరాబాద్ సిటీలో భారీ వ్యభిచారం రాకెట్ గుట్టుని రట్టు చేశారు పోలీసులు. పోలీసుల దాడుల్లో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో కండోమ్స్ సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో భారీ వ్యభిచారం రాకెట్ గుట్టు రట్టు-హైదరాబాద్ సిటీ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భారీ వ్యభిచారం రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. పోచారం సద్భావన టౌన్షిప్లో ఓ ఫ్లాట్లో ఆకస్మికంగా దాడి చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో శనివారం రాత్రి సోదాలు చేశారు. ఆ ఫ్లాట్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేల్చారు.
పోలీసుల అదుపులో ఆరుగురు అరెస్ట్-ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను రక్షించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో నిర్వాహకురాలు సహా ఐదుగురిని ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 17 ఏళ్ల బాలుడి ఉన్నాడు. దాడి సమయంలో ఫ్లాట్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని సమాచారం.
భారీగా కండోమ్స్, ఫోన్లు సీజ్-రూములను తనిఖీ చేయగా భారీగా కండోమ్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనిఖీలలో భాగంగా మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో మణి-జితేంద్ర కలిసి ఐదు నెలల కిందట ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అందులో వ్యభిచార కేంద్రాన్ని సీక్రెట్గా నిర్వహిస్తున్నట్లు తేలింది.
యాప్-వాట్సాప్ ద్వారా వ్యాపారం-ఇందుకోసం ఓ యాప్ ద్వారా కార్యకలాపాలు చేస్తున్నట్లు సమాచారం. కస్టమర్లకు వాట్సాప్ ద్వారా మహిళల ఫొటోలు పంపించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.
ALSO READ: మేడ్చల్ కాంగ్రెస్లో సస్పెన్షన్ వేటు కలకలం.. పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు!
జూలై 11న అంటే రాత్రి రూ.1500 చెల్లించి మహిళలతో ఏకాంత సేవలు పొందేందుకు వచ్చారు పలువురు కస్టమర్లు. వారిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేశారు. అరెస్టయిన వారిని న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.