Ranga reddy: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది షాబాద్ ఆరుగురి హత్యల కేసు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ మారణ హోమానికి కారణమైన నిందితుడు రాజ్కుమార్ పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించినట్లు వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజమందా? అన్నదే అసలు పాయింట్.
షాబాద్ సైకో కథ ఎండ్-రంగారెడ్డి జిల్లా మల్కారం గ్రామం సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ ఘటన జరిగినట్లు ఆ వార్తల వెనుక అసలు సారాంశం. ఘటన జరిగిన తర్వాత పోలీసులు గాలింపు చేపట్టారని, లొంగిపోవాలని హెచ్చరించారట. ఐనప్పటికీ నిందితుడు ఎదురుదాడి దిగినట్టు తెలుస్తోంది.
ఎన్కౌంటర్లో రాజ్కుమార్ హతం? ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్టు వార్తలు లేకపోలేదు. హత్యలు చేసిన తర్వాత రాజకుమార్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మల్కారం పరిసర ప్రాంతాల్లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు.
సోషల్ మీడియా వార్తలపై పోలీసులు సైలెంట్-నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. దీంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు లేకపోలేదు. దీనిపై పోలీసులు ఇప్పటివరకు నోరు మెదపలేదు. నిందితుడు కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారులు ఇదివరకు తెలిపారు.
మరి ఈ ఎన్ కౌంటర్ నిజమెంత? పోలీసులు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఆరుగుర్ని చంపిన తర్వాత నేరుగా పోలీసుల ముందు లొంగిపోయేవాడని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జైలు జీవితం గడిపిన వాడికి ఉందని, ఈ విషయంలో భయం ఉండదని అంటున్నారు. జైలులో ఉంటే వాడి ముఖం ఎవరికీ తెలీదని అంటున్నారు.
ALSO READ: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!
కావాలనే ఎవరో ఆ తరహా వార్తలను సర్య్కూలేట్ చేస్తున్నారని అంటున్నవాళ్లు లేకపోలేదు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో ఘటన జరిగింది. కేవలం రెండు గంటల్లో ఆరుగున్ని అత్యంత దారుణంగా ఊచకోత కోశాడు రాజ్కుమార్. వాడ్ని తమకు అప్పగించాలని బాధిత బంధువులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే.