E-Paper
Advertisement

Nagar Kurnool: హృదయ విదారకం.. చిన్నారి ప్రాణం తీసిన ఎలుక

Nagar Kurnool: హృదయ విదారకం.. చిన్నారి ప్రాణం తీసిన ఎలుక
Advertisement

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఎలుక కొరకడంతో కేవలం 40 రోజుల వయసున్న శిశువు మృతి చెందింది. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

మూడేళ్ల క్రితం పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములవాసి శివతో నాగనూలుకు చెందిన లక్ష్మీకళకు వివాహమైంది. నిండు గర్భిణీ అయిన లక్ష్మీకళ ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 40 రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో వారి ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు.

Advertisement

చిన్న బాబు ఇంట్లో పడుకుని ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి ఎలుక.. ఆ చిన్నారి ముక్కు కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. కానీ హైదరాబాద్ వచ్చినా.. శిశువు ప్రాణాలు దక్కకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం పసికందు డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×