E-Paper
Advertisement

Sankranti Buses : పండుగను సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్స్.. బస్సులపై 117 కేసులు నమోదు

Hyderabad : సంక్రాంతి పండుగను ప్రైవేట్ ట్రావెల్స్ సోమ్ము చేసుకుంటున్నాయి. సరైనా నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీని కూడా యాజమాన్యాలు పాటించడం లేదని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.

Sankranti Buses : పండుగను సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్స్.. బస్సులపై 117 కేసులు నమోదు

Sankranti Buses : సంక్రాంతి పండుగను ప్రైవేట్ ట్రావెల్స్ సోమ్ము చేసుకుంటున్నాయి. సరైనా నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీని కూడా యాజమాన్యాలు పాటించడం లేదని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.

మరోవైపు.. పండుగకు ఇంటికి ఎలాగైనా వెళ్లాలన్న ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ బస్సు సంస్థలు ప్రయాణికులు నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. బస్సు ఫిటినెస్ సరిగా లేకపోతే తప్ప టికెట్ రేట్లపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. పండుగకు ఆర్టీసీ బస్సులో ధరలు నిర్ణీతంగా ఉన్నాయి. ధరలు వివరాలు కూడా ఆర్టీసీ అధికారులు ముందే డిస్ ప్లే చేస్తున్నారు. అయితే ఇటువంటి నిబంధనలు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ పాటించడంలేదు.

సంక్రాంతి పండుగ వల్ల మూడు నెలలు క్రిందే రైలు టికెట్‌లు వెయిటింగ్ లిస్ట్‌కు చేరుకున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవెట్ ట్రావెల్స్ టికెట్ ధరలను పెంచి ప్రయాణికుల నుంచి డబ్బును దోచుకుంటున్నాయి. సాధారంగా ట్రైన్ ల్లో థర్డ్ ఏసీ ధర రూ.1200 ఉంటే స్లీపర్ బస్సులో రూ.3500-4000 వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సులో రూ.2500-3000 మధ్య టికెట్ రేట్‌లు ఉన్నాయి. కుటుంబంలో నలుగురు ఉంటే రానుపోను మొత్తం రూ.20వేల రూపాయలుపైగా ఖర్చు అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు యాప్‌లలో యథేచ్ఛగా నడుస్తోంది.

డబ్బుకు తగ్గటుగానే ప్రయాణ సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు ప్రయాణికులను మోసం చేస్తున్నాయి. ప్రయాణికుల మీద దురుసు ప్రవర్తనతో ఎన్నో ఫిర్యాదులు గతంలో నమోదు అయ్యాయి. రెండు రోజులుగా ఆర్టీఏ సిబ్బంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న బస్సులపై కేసులు నమోదు చేసారు. మొత్తం 117 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పన్నులు, ఇతర బకాయిలు కలిపి మొత్తం రూ.4.17 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×