E-Paper
Advertisement

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!
Advertisement

Kodi Cheruvu: గత కొంతకాలంగా తెలంగాణలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న ‘కోడి చెరువు’ ఆక్రమణకు గురైందంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రమేయం ఉందంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ వివాదంపై తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌పై వచ్చిన కబ్జా ఆరోపణలు పూర్తి అవాస్తవాలని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

2014లోనే చట్టబద్ధంగా భూమి కొనుగోలు

Advertisement

హైడ్రా నిర్వహించిన ప్రాథమిక విచారణ నివేదికల ప్రకారం.. జన్వాడ కోడి చెరువు పరిసర ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు భూమి ఉన్న మాట వాస్తవమే. అయితే, ఆ స్థలాన్ని ఆయన 2014లోనే అన్ని చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి కొనుగోలు చేశారని కమిషనర్ తెలిపారు. ఈ భూ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఆ భూమిలో కొన్ని ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోకి వస్తున్నప్పటికీ, ఆయన అక్కడ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని వెల్లడించారు.

చెరువు స్వరూపంలో మార్పుల్లేవు

Advertisement

పవన్ కళ్యాణ్ చెరువును ఆక్రమించారని లేదా అందులో మట్టి నింపి పూడ్చివేశారని వస్తున్న వార్తలను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖండించారు. అక్కడ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా కానీ, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేలా కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ప్రాథమిక పరిశీలనలో తేలింది. చెరువు అసలు స్వరూపం దెబ్బతినకుండా అలాగే భద్రంగా ఉందన్నారు.

మట్టి పూడ్చింది పక్కనున్న భూయజమానులే!

చెరువులో మట్టి నింపిన అంశంపై లోతుగా విచారణ జరపగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ చర్యలతో పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, చెరువు పక్కనే ఉన్న ఇతర భూయజమానులే మట్టి నింపే పనికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.

హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఈ అధికారిక క్లారిటీతో జన్వాడ కోడి చెరువు వివాదానికి పూర్తిగా తెరపడినట్లయింది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశంలో నిజాలు బయటకు రావడంతో, ఉద్దేశపూర్వకంగా జరిగిన దుష్ప్రచారానికి ముగింపు లభించినట్లయింది.

Also Read: హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Big Stories

Advertisement
×