E-Paper
Advertisement

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.

గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్‌ల ఆచూకీ మాత్రం గల్లంతైంది. అధికారులు వాళ్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి మంటలు చెలరేగిన భవనంలో ఉన్నట్లు గుర్తించారు.

భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. భవనం కూల్చివేతపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×