E-Paper
Advertisement

Weather Alert: ఎల్లో, ఆరేంజ్, రెడ్ అలర్ట్‌లు.. ఎప్పుడిస్తారు? ఎందుకిస్తారు?

Weather Alert: ఎల్లో, ఆరేంజ్, రెడ్ అలర్ట్‌లు.. ఎప్పుడిస్తారు? ఎందుకిస్తారు?
Advertisement
Weather Alerts in Telugu

Weather Alerts in Telugu(Telugu news updates): తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 13 జిల్లాల్లో కుంభవృష్టి ఖాయమని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. సియర్‌ సూన్‌, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపు వచ్చాయని చెబుతున్నారు అధికారులు. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌, మరో 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. మెదక్‌, సిద్దిపేట్‌, జనగాం, వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది.

Advertisement

ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ హెచ్చరిక జారీ చేస్తారు. డేంజర్ రాబోతోందని సూచనగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే ఈ ఎల్లో అలెర్ట్‌ ఉద్దేశం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం. 7.5 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లిమీటర్ల మధ్య వర్షపాతం నమోదై.. సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఈ ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.

ఆరెంజ్ అలర్ట్.. ఎల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

Advertisement

రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు.. ఎక్కువ నష్టం జరుగుతుందని భావిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×