E-Paper
Advertisement

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Advertisement

Auto Driver Sevalo Scheme: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లోని మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదే రోజున ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తామన్నారు.

అక్టోబర్ 4న ఖాతాల్లో డబ్బులు

‘ఆటోడ్రైవర్ల సేవలో’ పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 4న ప్రారంభించే ఈ పథకానికి 2,90,234 మందిని లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ఏదైనా కారణంతో అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ కు రూ.435 కోట్ల ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు.

Advertisement

గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామని చెప్పారు.

అతి పెద్ద సంక్షేమ పథకం

‘దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం. ఏపీలో ఏడాదికి రూ.32,143 కోట్లు పెన్షన్ల నిమిత్తం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7295 కోట్లు పెన్షన్లు కింద ఖర్చు పెడుతున్నాయి. అంటే పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నాయి’ – సీఎం చంద్రబాబు

Advertisement

దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని పింఛన్లను కూటమి సర్కారు ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పింఛన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో తొలిరోజునే 97 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయిస్తుందన్నారు. నెలకు రూ.2,745 కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తంగా 63.50 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వారిలో 59 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు.

తల్లికి వందనం దరఖాస్తులు

తల్లికి వందనం పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 10,090.74 కోట్లను తల్లికి వందనం పథకానికి ఖర్చు పెట్టామన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. ఇప్పటికీ తల్లికి వందనం పథకం అందని వారు ఉంటే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.

దీపం-2.0 పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీపం-2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు అందచేశామని స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.1718 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు.

Also Read: AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్

ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు. లబ్దిదారుల జాబితాలు ఇప్పటికే సిద్ధం చేశారు. జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి లాగిన్ అవసరం లేదు
ఆటో డ్రైవర్ ఆధార్ నెంబర్ తో https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ఈ వెబ్ సైట్ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×