Railway Fire: కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న రైలు నుంచి ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
కోల్కతాలో అక్కడి లోకల్ ట్రైన్ దక్షిణేశ్వర్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ట్రైన్లోకి ఎక్కుతున్నారు. అయితే రైలు పైభాగంలో ఉన్న విద్యుత్ లైన్లలో నుండి ఓక్కసారిగా భారీ శబ్ధంతో మంటులు వచ్చాయి. దీంతో అక్కడి ప్రయాణికులు రైలులోనుండి బైటికి వచ్చి పరుగులు తీశారు. మంటలను చూసిన ప్రయాణికులు కేకలు వేస్తూ పక్కనున్న ప్లాట్ ఫామ్ పైకి పరుగులు తీశారు.
Alao Read: కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, కిడ్నాప్ కేసు కష్టాలు, సెల్ఫీ వీడియో విడుదల, ఏం జరిగింది?
అదృష్టవశాత్తూ ఈ పెను ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హని కానీ, ప్రాణాలు కానీ పోలేదు. దీంతో రైళ్వే సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పూర్తిస్తాయిలో విచారించి ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రైలుపై మంటలు.. ప్రయాణికుల పరుగులు
కోల్కతాలోని దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న రైలు నుంచి ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ… pic.twitter.com/OhI5bZTBNm
— BigTV APP (@BigtvApp) July 30, 2026
Also Reda: ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్ట్లు వెళ్లే దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?