Samsung New Phones: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ పాపులర్ బడ్జెట్ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లను రంగంలోకి దించడానికి సిద్ధమవుతోంది. గెలాక్సీ A08 4G, గెలాక్సీ M08 4G, గెలాక్సీ F08 4G మోడల్స్ పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్ సైట్లతో పాటు భారత దేశానికి చెందిన BIS వెబ్సైట్లో కూడా ప్రత్యక్షమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఫోన్లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. గెలాక్సీ A08 4G ఫోన్ బ్యాటరీ విషయంలో పెద్ద అప్గ్రేడ్ ఉండబోతోంది. గతంలో వచ్చిన A07లోని 5,000mAh స్థానంలో ఈసారి ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి తోడు 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వెనుక వైపు రెండు కెమెరాల సెటప్తో పాటు డ్యూయల్ సిమ్, వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఇందులో రానున్నాయి.
Also Read: ఊహించని ట్విస్ట్.. Motorola Edge 60 Proలో ఐఫోన్ డైనామిక్ ఐలాండ్, వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
A08తో పాటు M08 4G, F08 4G మోడల్స్ కూడా వైఫై అలైయెన్స్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నాయి. సాధారణంగా శాంసంగ్ A సిరీస్ ఫోన్లలో ఉండే ప్రధాన హార్డ్వేర్నే కొన్ని చిన్నచిన్న మార్పులతో M, F సిరీస్లలో ఇస్తుంటుంది. ఈ కొత్త ఫోన్లలో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై సహా దాదాపు ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.
గతంలో వచ్చిన మోడల్స్ 6.7 ఇంచుల HD+ డిస్ప్లే, మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా, IP54 రేటింగ్తో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. సుదీర్ఘ కాలం పాటు ఓఎస్ అప్డేట్స్ ఆఫర్ చేశాయి. ఇప్పుడు రాబోయే కొత్త సిరీస్ కూడా అదే స్థాయిలో మెరుగైన ప్రాసెసింగ్ పవర్తో వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి ధరలు, లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: ఐఫోన్ యూజర్లకు మెటా సర్ప్రైజ్.. వాట్సప్ చాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది!