E-Paper
Advertisement

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!
Advertisement

24K Gold Ganesh Idol in Hyderabad:  హైదరాబాద్‌ లో వినాయక చవితి సందడి మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గణపతి విగ్రహాల ఏర్పాటు, ప్రత్యేక మండపాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బేగంబజార్‌లో ఏర్పాటు చేసిన లీ-చీ కా రాజా 2026 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెప్టెంబర్ 9న ఈ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆగమనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

బంగారు మెరుపులతో ప్రత్యేక ఆకర్షణ

లీ-చీ కా రాజా విగ్రహాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూత పూయడంతో గణపతి స్వరూపం బంగారు కాంతులతో మెరిసిపోతోంది. దీనికి తోడు ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్స్‌ ను ఉపయోగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. వెలుతురు పడినప్పుడు వజ్రాల మెరుపులు, బంగారు పూత కలసి విగ్రహానికి మరింత వైభవాన్ని తీసుకొస్తున్నాయి. దీంతో గణపతిని చూసేందుకు వచ్చే భక్తులు, సందర్శకులు ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారు.

ముంబై, తిరుపతి స్ఫూర్తితో!

Advertisement

లీ-చీ కా రాజా రూపకల్పనలో దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, గణేశ్ ఉత్సవ సంప్రదాయాల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్‌ బాగ్చా రాజా, తిరుమలలోని తిరుపతి బాలాజీ నుంచి స్ఫూర్తి తీసుకుని ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. ముంబై గణేశ్ ఉత్సవాలకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, తిరుపతి బాలాజీకి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిపేలా విగ్రహాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

భక్తులతో కిటకిటలాడుతున్న బేగంబజార్

విగ్రహం బేగంబజార్‌కు చేరుకున్నప్పటి నుంచి భక్తుల సందడి మరింత పెరిగింది. కుటుంబాలతో కలిసి గణపతిని దర్శించుకునేందుకు చాలామంది వస్తున్నారు. విగ్రహం ప్రత్యేకత గురించి తెలుసుకున్న తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తున్నారు. వినాయకుడి ఆగమన వేడుకల సమయంలో భక్తి కార్యక్రమాలతో పాటు సందడి వాతావరణం కనిపించింది. గణపతి దర్శనంతో పాటు విగ్రహం అలంకరణను చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్ గణేశోత్సవాల్లో మరో ప్రత్యేక ఆకర్షణ

Advertisement

ప్రతి ఏడాది హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది బేగంబజార్‌లోని లీ-చీ కా రాజా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు పూత, లక్షలాది వజ్రాల మెరుపులతో రూపొందిన ఈ గణపతి విగ్రహం నగర గణేశోత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఈ గణపతిని చూసేందుకు మండపానికి భారీగా భక్తులు తరలిస్తున్నారు.

Read Also: యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

Tags

Related News

యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

ఇండోనేషియా To జపాన్.. భారత్ కంటే ముందే ఇతర దేశాల్లో గణపతి పూజ జరిగిందా?

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

భారత్‌ లో లాంగెస్ట్, షార్టెస్ట్ హైవేలు ఇవే.. పొడవు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

వందే భారత్ vs రాజధాని ఎక్స్‌ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!

బ్రిక్స్ కోసం ఢిల్లీకి భారీ భద్రత.. రోడ్లే కాదు, ఎయిర్ స్పేస్ పైనా పరిమితులు!

Big Stories

Advertisement
×