E-Paper
Advertisement

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Advertisement

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అత్యాధునిక సౌకర్యాలు

2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఇకపై పనులపై క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాంపల్లి రైల్వే స్టేషన్‌ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Also Read: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

రూ.48 వేల కోట్ల పనులు

నాంపల్లి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ లో భాగంగా, రెస్టారెంట్లు, స్టాళ్లు, మెరుగైన సౌకర్యాలతో సెంట్రల్ హాల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకని వై-ఫై కనెక్టివిటీ, సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,450 కోట్లకు పైగా కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా దాదాపు రూ.48,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×