E-Paper
Advertisement

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే
Advertisement

Vemulawada Rajanna Temple:  దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్న ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం కొలువుదీరింది. ఈ ఆలయం కూడా శైవ క్షేత్రమే. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయంలో స్వయంభు శివుడు కొలువుదీరాడు. లింగం రూపంలోనే శివుడు దర్శనం ఇస్తాడు. ఉత్తర తెలంగాణ ప్రజలు వేములవాడ రాజన్నను ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మ‌హారాష్ట్ర, సోలాపూర్‌, ముంబై నుంచి కూడా భ‌క్తులు వ‌స్తారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

వేముల‌వాడ రాజ‌న్న‌కు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ?

Advertisement

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం గోవులు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి ఆలయంలో గోవులు ఉన్నట్లుగానే రాజన్న ఆలయంలో కూడా మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. వేములవాడ ఆలయంలో ఉన్న గోవులను కోడెలుగా పిలుస్తూ ఉంటారు. తెలంగాణ యాస భాష ప్రకారం కోడెలుగా పిలవడం మొదటి నుంచి వచ్చింది. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు కట్టడం వెనుక రహస్యం ఉంది. శివుడికి కోడలు అంటే చాలా ఇష్టం. యవ్వనంలో ఉన్న ఆ కోడెలను స్వామివారికి సమర్పించడమే ఈ మొక్కు ఉద్దేశం.

స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి ఆ ఇద్దరు పూజలు చేశారు. ఈ క్రమంలో వేములవాడ రాజన్న అనుగ్రహంతో సాంబుడు అనే పుత్రుడు… శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు జన్మించాడు. అయితే తమ కోరిక తీర్చినందుకుగాను ధర్మదేవ అనే కోడెను మొక్కుబడిగా శ్రీకృష్ణుడు సమర్పించాడు. దీంతో అప్పటి నుంచి, కోరికలు తీరిన తర్వాత కోడెలు కట్టేయడం ఆనవాయితీగా వచ్చింది.

ఎవరెవరు కోడెలు కడతారు ?

Advertisement

సంతానం కోసం వేములవాడ రాజన్నను చాలామంది భక్తులు సందర్శిస్తుంటారు. రాజన్న సన్నిధికి వచ్చిన దంపతులకు కచ్చితంగా పిల్లలు పుడతారని వారి నమ్మకం గట్టిగానే ఉంది. అయితే సంతానం కలిగితే, కోడెలు కట్టేసి తమ ముక్కు తీర్చుకుంటారు. అనారోగ్యంగా ఉన్నవాళ్లు, సిరిసంపదల కోసం, జీవితంలో సక్సెస్ కావడం కోసం ఈ మొక్కలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు.

కోడెను కట్టు విధానం

వేములవాడ రాజన్న ఆలయంలో శివుని ఆలయం చుట్టూ ఆ కోడెలు పట్టుకొని భక్తులు తిరగాలి. మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత గజ స్తంభానికి ఆ కోడెను కట్టేయాలి. అప్పుడే మొక్కు చెల్లించినట్లు అవుతుంది. ఇది అక్కడి భక్తుల నమ్మకం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… వేములవాడ ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాత ఆలయాన్ని, పూర్తిగా మార్చేసి… కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం కోట్లల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మరో ఏడాదిలోపు వేములవాడ రాజన్న కొత్త ఆలయం పూర్తి కానుంది. ఇక్కడే బద్ది పోచమ్మ ఆలయం కూడా చాలా ఫేమస్. ఆమెకు కూడా పెద్ద దేవాలయాన్ని కట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !


Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×