IRCTC Simla Tourist Train: ఈ వేసవిలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హిల్ స్టేషన్ లకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే భారతీయ రైల్వే హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. సిమ్లా, కులు, మనాలి హిల్ స్టేషన్ లను కవర్ చేసేలా 14 రోజుల టూరిస్ట్ రైల్వే ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ప్రయాణికులకు 33% సబ్సిడీని అందిస్తుంది. భారత్ గౌరవ్ రైలులో సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఈ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ రైలు ఏప్రిల్ 10న బయలుదేరుతుంది. ప్రస్తుతం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లతో పాటు, ఆగ్రా, ఢిల్లీ, అమృత్సర్తో సహా నార్త్ లోని ప్రధాన నగరాలను ఈ ట్రిప్ లో కవర్ చేస్తారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బయలుదేరుతుంది. పెనుకొండ, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్నగర్, సికింద్రాబాద్లలో షెడ్యూల్ స్టాప్లు ఉన్నాయి.
ఈ టూర్ లో పర్యాటకులు ఆగ్రా, సిమ్లా, కులు, మనాలి, అమృత్సర్, ఢిల్లీలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ ధరలు స్లీపర్ క్లాస్ కు రూ. 38,500, థర్డ్ ఏసీకి రూ. 43,300, సెకండ్ ఏసీకి రూ. 49,100, ఫస్ట్ ఏసీకి రూ. 58,400గా ఉన్నాయి.
Also Read: ఈ సమ్మర్లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!