E-Paper
Advertisement

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన రైలు.. పట్టాలు తప్పిన మూడు బోగీలు, అసలేం జరిగింది?

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన రైలు.. పట్టాలు  తప్పిన మూడు బోగీలు, అసలేం జరిగింది?
Advertisement

Train derail: ఉత్తరాఖండ్‌లోని యోగనగరి రిషికేశ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్ బోగీలను మార్చే ప్రక్రియ జరుగుతుండగా రైలు ఒక్కసారిగా అదుపు తప్పింది. రైలు వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో రైల్వే స్టేషన్ రక్షణ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ రైలు

Advertisement

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌ ప్రాంతంలోని ఖండ్ గావ్ ప్రాంతంలో యోగ్‌నగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిన్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఘటన సమయంలో రైలులో ఎవరూ లేరు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాత్రి దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది.

పనుల నిర్వహణ మయంలో బ్రేకులు విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఘటన జరిగి దాదాపు రెండున్నర గంటల వరకు రైల్వే అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకోలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఘటన తర్వాత రైలు పట్టాలపైకి సమీపంలోని ప్రజలు తరలివచ్చారు. అయితే రైల్వే పోలీసులు వారిని చెదరగొట్టారు. జరిగిన ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

పట్టాలు తప్పిన మూడు బోగీలు,  దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు

రైలు పట్టాలు తప్పిన తర్వాత రైల్వే విభాగం, సహాయక చర్యలు చేపట్టింది. రాత్రంతా పనుల పునరుద్దరణలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయిన మూడు కోచ్‌లను క్రేన్ల సాయంతో తొలగించారు. కార్యకలాపాలు సాధారణ స్థాయికి తీసుకురావడానికి రైల్వే సహాయక బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి.

గడిచిన మూడు రోజుల్లో మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం త్రివేంద్ర నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే రైల్వే గార్డు సకాలంలో చూసి లోకో పైలట్ ను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ALSO READ: భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

సోమవారం బీహార్‌లోని ససారం రైల్వేస్టేషన్‌లో ఆడివున్న రైలు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు కిందకు దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఉజ్జయని రైలు వంతు అయ్యింది. ఇలా వరుసగా రైలు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

 

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×