E-Paper
Advertisement

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?
Advertisement

Loud Phone Speakers in Public: బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు హెడ్‌ ఫోన్లు ఉపయోగించకుండా ఫోన్‌ లో పెద్దగా సౌండ్ పెట్టి పాటలు, వీడియోలు చూస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగినా పట్టించుకోరు. ఇటీవల ఈ అలవాటు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటంతో దీనిపై పలు దేశాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ అలవాటును మాన్పించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నాయి.

గట్టిగా పాటలు వింటే భారీ జరిమానా

ఐర్లాండ్‌లోని ఐరిష్ రైల్ సంస్థ రైళ్లలో పెద్ద శబ్దంతో ఫోన్ చూసే వారికి 100 యూరోల వరకు జరిమానా విధించే నిబంధన తీసుకొచ్చింది. అలాగే ప్రయాణికులు తప్పనిసరిగా ఇయర్‌ ఫోన్లు ఉపయోగించాలని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి అలవాటును నియంత్రించేందుకు కఠిన నిబంధనలను తీసుకొచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి. లండన్‌లో ప్రజా రవాణా ఉపయోగించే వారికి హెడ్‌ ఫోన్లు ధరించాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.

సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే?

Advertisement

ఈ సమస్యకు ప్రధాన కారణం సామాజిక నియమాల్లో వస్తున్న మార్పులేనని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో నిశ్శబ్దంగా ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం సాధారణ మర్యాదగా భావించేవారు. ఇప్పుడు కొందరు అలాంటి నియమాలను పట్టించుకోవడం లేదు. దీంతో తమకు నచ్చిన కంటెంట్‌ ను ఇతరుల గురించి ఆలోచించకుండా గట్టిగా వినడం సాధారణ విషయంగా మారుతోంది.

సమాజంలో కొన్ని ప్రవర్తనలు లిఖితపూర్వకంగా ఉండవని.. ఎవరూ ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరూ పాటిస్తారని లిమరిక్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ నిపుణులు వెల్లడించారు. కానీ, కొందరు వాటిని ఉల్లంఘించడం మొదలుపెడితే, మిగతావారికి కూడా అది సాధారణంగా కనిపించే అవకాశం ఉంటుందన్నారు. అదే ఇప్పుడు ప్రజా రవాణాలో కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకొచ్చారు.

స్మార్ట్‌ ఫోన్లతో ఇయర్‌ ఫోన్లు ఇవ్వకపోవడం

Advertisement

ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే, ప్రస్తుతం చాలా స్మార్ట్‌ ఫోన్లతో పాటు ఇయర్‌ ఫోన్లు ఇవ్వడం లేదు. దీంతో చాలామంది ప్రత్యేకంగా కొనకుండా ఫోన్ స్పీకర్‌ పైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కూడా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దంతో వీడియోలు చూడటం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రజల ప్రవర్తనలో కూడా కొంత మార్పు వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకపోవడం లాంటి ధోరణి పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రయాణికులు అసౌకర్యంగా భావించినా, సౌండ్ తగ్గించమని చెప్పడానికి వెనుకాడుతుంటారు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల గొడవ జరిగే అవకాశం ఉంటుందని భావిస్తారు. దీంతో ఇబ్బంది పడినా మౌనంగా ఉండిపోతారు.

యువతలో సోషల్ మీడియా వీడియోలను కలిసి చూడటం లేదా బిగ్గరగా ప్లే చేయడం కొంతమందికి సహజంగా అనిపించవచ్చు. అలాంటి ప్రవర్తనను తరచూ చూసే కొద్దీ అది కూడా ఒక కొత్త సామాజిక అలవాటుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హెడ్‌ఫోన్లు ఉపయోగించడం, ఫోన్ శబ్దాన్ని తగ్గించడం వంటి చిన్న మర్యాదలు పాటిస్తే మనతో పాటు ఇతరుల ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు.

Read Also: శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్ నుంచి గంటలోనే ప్రయాణం!

Related News

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

Big Stories

Advertisement
×