Sridevi Drama Company Promo : బుల్లితెరపై ఎన్నో రకాల కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి.. ఒకప్పుడు కేవలం జబర్దస్త్ మాత్రమే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేది.. ఈ మధ్య ప్రతి ఛానల్ కొత్త ప్రోగ్రాంలను జనాలకి అందిస్తున్నాయి. అందులో ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి.. ఈ షోలో జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తుండగా యాంకర్ గా రష్మి గౌతమి చేస్తున్నారు. ప్రతి వారం కూడా ఈ షో కి మంచి టిఆర్పి రేటింగ్ వస్తుండడంతో ఇక స్కిట్లలో కొంచెం డోస్ను పెంచుతున్నారు కమెడియన్లు.. ఈ క్రమంలో ఈ ఆదివారం రాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేసారు. ఆ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో నెటిజన్లు ప్రోమో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. అందులో ఇంద్రజ చాలా ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. అంతే కాదు కమెడియన్లకు వార్నింగ్ కూడా ఇస్తుంది.. ఇంద్రజ అంతగా సీరియస్ అవ్వడానికి కారణం ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విషయానికి వస్తే.. ఈవారం అందరూ జంటలుగా షోలోకి అడుగు పెడతారు.. ఇంద్రజ తన హస్బెండ్ ని కూడా షోకి తీసుకొని వస్తారు.. అందరూ సరదాగా తమ హస్బెండ్ లతో చేసే కామెడీ మామూలుగా ఉండదు.. అయితే ఈ షోలో స్కిట్లు కూడా జంటలుగానే చేస్తున్నట్లు కనిపిస్తుంది.. చివరగా వచ్చిన ఫైమా, బుల్లెట్ భాస్కర్లు ఇంద్రజ గారి లాగా చేయాలని అనుకుంటారు.. ఇంద్రజ, తన భర్త ఇంట్లో ఎలా ఉంటారు అని వాళ్ళు ఆ స్కిట్ లో చేసి చూపిస్తారు.. ఫైమా అలాగే భాస్కర్ ఇద్దరూ ఆ స్కిట్ చేస్తున్నప్పుడు ఇంద్రజ మొహం చాలా బాధ పడ్డట్లు కనిపిస్తుంది.. అంతే కాదు ఆమె మధ్యలో మైక్ తీసుకొని షో అని పిలిచి అవమానిస్తారా అని ఒక్క మాటతో అందరికీ షాక్ ఇస్తుంది.. ఇంద్రజ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. నేను ఇంట్లో అలా చేస్తానా మీరు ఎందుకు ఇలా చేశారు అని సీరియస్ అవుతుంది ఇంద్రజ.. అది నిజంగానే జరిగిందా లేదా ఆవిడ కామెడీ కోసం అలా మాట్లాడిందా అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇంద్రజ ఒక్కసారిగా ఆ ప్రోమోలో అలా మాట్లాడే లోగా ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలని జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. మరి ఈ ఎపిసోడ్లో నిజంగానే ఇంద్రజ సీరియస్ అయిందా లేదా అన్నది తెలిసే అవకాశం ఉంది..
అప్పుడు కామెడీ స్కిట్లు అంటే రోజా నవ్వే ఎక్కువగా వినిపించేది.. కానీ ఈ మధ్య ఆమె బుల్లితెరకు కాస్త దూరంగా ఉండడంతో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంద్రజనే కనిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈమె వేసే పంచులు, చెప్పే జడ్జిమెంట్ కి జనాలు కూడా ఫిదా అవుతుంటారు.. ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు.. అందులో ఆమె ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండే ఇంద్రజ తాజాగా మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు ఈ షోలో ఏం జరుగుతుంది అన్నది ప్రోమోలో అర్థం కావడం లేదు. అందరూ జంటలుగా వచ్చి తమ భార్యలకి ప్రపోజ్ చేసేంతవరకు ప్రోమో బాగానే సాగింది.. ఎప్పుడైతే పైమా స్కిట్ వచ్చిందో అప్పుడే ఇంద్రజ కోపంగా మారిపోయింది.. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ కనిపించిన ఇంద్రజ ఇలా మాట్లాడడం పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. నిజంగానే ఇంద్రజ ఫీల్ అయి ఉంటుందా లేదా ఇదంతా స్కిట్లోనే భాగమా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా కూడా ఇంద్రజ గురించి ఒక క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ని తప్పకుండా చూడాల్సిందే.. ఈ మధ్య షోలలో ఇలాంటివి జరగడం కామన్ అయిపోయింది.. కామెడీ కోసం అని డైరెక్టు జడ్జీలపైనే స్కిట్లు చేస్తూ అభిమానులకు కోపాన్ని కూడా తెప్పిస్తుంటారు.. ఏది ఏమైనా కూడా ఇలాంటివి తగ్గించి కామెడీతో జనాలను నవ్విస్తే బాగుంటుంది అని సదరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.