Gundeninda Gudigantalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎక్కువగా రేటింగ్ ని సొంతం చేసుకున్నా సీరియల్ గుండెనిండా గుడి గంటలు.. కార్తీకదీపం తర్వాత రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ లలో ఇది మూడవ స్థానంలో ఉంది.. డిఫరెంట్ స్టోరీ తో పాటుగా బాలు మీనాలా క్యారెక్టర్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. మిగతా స్టోరీ ఎలా ఉన్నా సరే… ఈ ఫీల్ మొత్తానికి బాలు మీనాలే హైలెట్ గా నిలుస్తుంటారు.. బాలు తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ అందరిని నోరు మెదపకుండా చేస్తుంటాడు.. మీ సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడిప్పుడే ప్రభావతి మారుతుంది అనుకున్నప్పుడు బాలు మీనాలకు మరోసారి యాక్సిడెంట్ జరుగుతుంది.. అసలు బాలు మీనాలుగు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ సీరియల్ స్టోరీని మార్చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… అసలు ఇందులో హీరో, హీరోయిన్ కి ఎలా యాక్సిడెంట్ అయింది..? నెక్స్ట్ స్టోరీ ఏంటో అన్నది ఒకసారి తెలుసుకుందాం..
గుండెనిండా గుడి గంటలు సీరియల్ ప్రస్తుతం రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. శివ మీద రివేంజ్ తీర్చుకోవడానికి గుణ బాలు శివలను ఇరికించాలని అనుకుంటాడు. రోహిణికి సాయం చేస్తానని చెప్పి బాలుని ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తాడు.. ఇక బాలు మీనా నీ రెస్ట్ తీసుకోమని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం పువ్వులు ఇవ్వాలి ఆర్డర్ వచ్చింది అంటూ అతన్ని తిడుతుంది.. అర్జెంటుగా వెళ్లి పువ్వులను ఇవ్వాలి అని నేను అంటుంది… ఇక బాలు తప్పని పరిస్థితులలో మీనాని తీసుకొని వెళ్లడానికి ఒప్పుకుంటాడు.. బాలు మీనాలని ఏదో ఒకటి చేయాలని గుణ ఎదురుచూస్తూ ఉంటాడు.. అదనగా చూసుకొని వాళ్ళు బయటికి వెళ్ళగానే వాళ్ళని యాక్సెంట్ చేసేస్తాడు.. తృటిలో ప్రమాదం తప్పి ఇద్దరూ కింద పడిపోతారు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకరినొకరు పరామర్శించుకుంటారు.. వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బాలు అలియాస్ విష్ణు కాంత్ ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..
Also Read :‘పొదరిల్లు’ మాధవ్ లవ్ స్టోరీ.. బాబు బాగా రొమాంటికే..
గుణ బాలుని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ తనని కొడుతున్నాడని తిడుతున్నాడని అడ్డు తొలగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తాడు.. కానీ ఇప్పటివరకు చేసిన అన్ని ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టేస్తాయి. అయినా కూడా బాలుని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని గుణ ఆలోచిస్తూ ఉంటాడు. శివని అడ్డుపెట్టుకొని తన పగని సాధించాలని అనుకుంటాడు. కానీ శివ తన అక్కకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక పోతాడు.. అక్కని తోసేసినందుకు గుణపై కోపాన్ని పెంచుకుంటాడు.. ఇక బాలు మీనాలని చంపాలని ప్రయత్నించిన గుణ గురించి బాలు తెలుసుకుంటాడని తెలుస్తుంది.. ఒకవేళ అదే కనుక నిజమైతే గుణ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పడం కష్టమే.. రోహిణి అనుకున్నట్లుగా బాలు శివ గురించి ఇంట్లో చెప్పేసిన సరే ప్రభావతి మాత్రం మీనా వల్ల మారుతుందని అర్థమవుతుంది.. రోహిణి బండారం దినేష్ వల్ల బయటపడే రోజులు దగ్గర పడినట్లు తెలుస్తుంది.. మరి రోహిణి దొరుకుతుందా? 40 లక్షల గురించి మనోజ్ ఇంట్లో చెప్పేస్తాడా అన్నది కేవలం కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.. మరి ఈ స్టోరీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి…