Anchor Rashmi:సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎవరో ఒకరితో క్లోజ్ గా కనిపిస్తే చాలు.. లేనిపోని నిందలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారితో కనిపించకపోయినా సరే ఏదో ఎఫైర్ ఉందనే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ సెలబ్రిటీలను మానసిక వేదనకు గురి చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇలాంటి మాటలను కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే.. ఇంకొంతమంది తట్టుకోలేక భారీ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్ రష్మీ (Rashmi) తాజాగా ఒక నెటిజన్ పై మండిపడ్డ తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా నీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే చూపించు అంటూ కౌంటర్ ఇచ్చింది మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గత కొన్ని రోజులుగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి రష్మీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలని, తనకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా తనను వేధించే హక్కు మీకు ఎవరికీ లేదు అంటూ మండిపడింది. ముఖ్యంగా తాను పెళ్లి చేసుకునే వరకు ఎంతో మందితో తిరిగిన అది మీ సమస్య కాదు అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
దీనిపై రష్మిక మాట్లాడుతూ..”నీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే చూపించు. ఇక నాకు ఎంతమందితో ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నాపై వేధింపులకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను కానీ , మీ తండ్రిని కానీ, లేదా మీ కొడుకును కాని వివాహం చేసుకునే వరకు నేను ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరి ఎవరితో లింకు ఉందో దయచేసి వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పండి. మీరు ఎవరికి వ్యక్తిత్వాన్ని అయినా హత్య చేయాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం” అంటూ సదరు నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది మొత్తానికి అయితే ఇతరులతో అనవసరమైన సంబంధాలు అంటగడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ .ఇక ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మీ విషయానికి వస్తే ..సినిమాల ద్వారానే మొదట తన కెరీర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే అక్కడ హీరోయిన్గా అవకాశాలు తలుపు తట్టకపోయేసరికి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ జబర్దస్త్ కార్యక్రమంతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఇలాంటి సమయంలోనే ఈమెపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది రష్మీ
First and foremost show the proof
Secondly no matter how many relationships I have or not
No one has the right to abuse me
And until and unless I’m getting married to you or or your father or your son
Neenu yetha mandi tho teerigina aadi mee problem kadu
Also naku yevari… https://t.co/RPYQ8fZj50— rashmi gautam (@rashmigautam27) March 8, 2026